ETV Bharat / crime

కరోనాతో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి

author img

By

Published : May 7, 2021, 2:34 PM IST

కరోనా రోజురోజుకీ కోరలు చాస్తోంది. పలువురిని పొట్టన బెట్టుకుంటోంది. మహమ్మారి ధాటికి కరీంనగర్‌ జిల్లా అచ్చంపల్లిలో ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. గ్రామ పంచాయతీ సిబ్బంది కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అంతక్రియలు పూర్తి చేశారు.

Corona deaths, karimnagar news, achampalli
Corona deaths, karimnagar news, achampalli

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం అచ్చంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు.. ఆలేటి ఎల్లారెడ్డి, ఆలేటి తిరుపతిరెడ్డి మృతి చెందారు.

వీరిద్దరు ఏడు రోజుల క్రితం కొవిడ్​ బారిన పడ్డారు. హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ.. నేడు కన్నుమూశారు. ఒకే ఇంటికి చెందిన ఇద్దరు మృత్యువాత పడటం వల్ల.. కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతదేహాలను గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్‌లో వైకుంఠధామానికి తరలించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అంతక్రియలు పూర్తి చేశారు.

ఇదీ చూడండి: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని.. విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు మృతి

కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం అచ్చంపల్లిలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకి ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు.. ఆలేటి ఎల్లారెడ్డి, ఆలేటి తిరుపతిరెడ్డి మృతి చెందారు.

వీరిద్దరు ఏడు రోజుల క్రితం కొవిడ్​ బారిన పడ్డారు. హోం ఐసోలేషన్‌లోనే ఉంటూ.. నేడు కన్నుమూశారు. ఒకే ఇంటికి చెందిన ఇద్దరు మృత్యువాత పడటం వల్ల.. కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

మృతదేహాలను గ్రామ పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్‌లో వైకుంఠధామానికి తరలించారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ అంతక్రియలు పూర్తి చేశారు.

ఇదీ చూడండి: ప్రమాదవశాత్తు రైలు ఢీకొని.. విధుల్లో ఉన్న ఇద్దరు ఉద్యోగులు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.