రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట మున్సిపాలిటీ పరిధిలోని లక్ష్మారెడ్డి పాలెం హనుమాన్ దేవాలయంలో దుండగుల సంచలనం స్థానికంగా కలకలం రేపింది. రాత్రి ఆలయంలోకి చొరబడిన గుర్తు తెలియని వ్యక్తులు.. నవగ్రహాల విగ్రహాలు, గోపురాలు, హుండీ, గేట్లు, మైకులను ధ్వంసం చేశారు. ఆలయంలో దుండగులు సంచరిస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో ఉదయం నడకకు వెళ్లిన కాలనీవాసులు ఈ విషయాన్ని గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల విజువల్స్ను పరిశీలిస్తున్నారు.
పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఈ ఘటన జరిగిందని స్థానికులు ఆరోపించారు. హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. వారిని చెదరగొట్టే క్రమంలో పోలీసులు, స్థానికులకు మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది.
ఇదీ చదవండి: AGENCY PROBLEMS: సరుకులు కొనాలంటే.. ప్రాణాలు పణంగా పెట్టాల్సిందే!