జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్యాలలోని కట్ట రాజరాజేశ్వరస్వామి ఆలయంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. టెంకాయ కొట్టె రాడుతో సీసీ కెమెరాలు ధ్వంసం చేసి హుండీని అపహరించుకుపోయారు.
కొడిమ్యాల సమీపంలో ఖాళీ హుండీని వదిలేసి పరారయ్యారు. ఐదేళ్ల క్రితం నిర్మించిన ఆలయంలో పదేపదే దొంగతనానికి పాల్పడుతున్నారని గ్రామస్థులు తెలిపారు.
ఇదీ చూడండి: యాదాద్రిలో చకాచకా సాగుతున్న నిర్మాణ పనులు