మద్యం మత్తు, మితిమీరిన వేగానికి హైదరాబాద్ ఓఆర్ఆర్పై మరో రోడ్డు ప్రమాదం జరిగింది. పీకల్లోతు తాగిఉన్నవారు శంషాబాద్ రాళ్లగూడ వద్ద స్తంభాన్ని కారుతో ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ పోలీసులు గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. కారులో ఎయిర్ బెలూన్స్ ఓపెన్ కావడంతో ప్రమాదం తప్పిందని తెలిపారు. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వెళుతుండగా ఘటన జరిగిందని వెల్లడించారు.
క్షతగాత్రులంతా హైదరాబాద్లోని టౌలీచౌకి ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వీరంతా శంషాబాద్ ఎయిర్ పోర్ట్కు ఫొటో షూట్ కోసం వెళుతున్నట్లు సమాచారం. క్రేన్ సహాయంతో కారును పక్కకు తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చూడండి: విరిగిన హైమాస్ట్ లైట్ స్తంభాలు.. తప్పిన పెను ప్రమాదం