ETV Bharat / crime

కర్మన్​ఘాట్​లో ఉద్రిక్తత.. గోరక్షకులపై తరలింపుదారుల దాడి.. పోలీసుల లాఠీఛార్జ్​..

author img

By

Published : Feb 23, 2022, 6:01 AM IST

Updated : Feb 23, 2022, 6:19 AM IST

గోవుల అక్రమ రవాణా హైదరాబాద్ కర్మన్‌ఘాట్​లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. గోవులను అక్రమమగా తరలిస్తున్నారనే సమాచారంతో అడ్డుకునే ప్రయత్నం చేయగా.. గోరక్షకులపై తరలింపుదారులు దాడికి పాల్పడ్డారు. దాడికి పాల్పడ్డవారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ.. పెద్ద సంఖ్యలో యువత కర్మన్​ఘాట్ హనుమాన్ ఆలయం వద్ద ఆందోళనకు దిగడంతో పరిస్థితి తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది.

Tense atmosphere in karmanghat for conflict between cow saviors and  Smugglers
Tense atmosphere in karmanghat for conflict between cow saviors and Smugglers
కర్మన్​ఘాట్​లో ఉద్రిక్తత.. గోరక్షకులపై తరలింపుదారులు దాడి.. పోలీసుల లాఠీఛార్జ్​..

గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్​లోని కర్మన్​ఘాట్‌ గోరక్షక సేవాసమితి సభ్యులు.. టీకేఆర్ కమాన్ వద్ద వాహనాన్ని అడ్డగించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వాహనాలు దెబ్బతినడంతో పాటు, గోరక్షకులపై తరలింపుదారులు దాడికి పాల్పడ్డారు. గోరక్షకుల నుంచి తప్పించుకునేందుకు తరలింపుదారులు దగ్గరలోని హనుమాన్ ఆలయంలో తలదాచుకున్నారు. వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ యువకులు రాత్రంతా నిరసన చేపట్టారు. తమపై దాడికి పాల్పడ్డ దుండగులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను గోసంరక్షకులు డిమాండ్‌ చేశారు.

మంగళవారం(ఫిబ్రవరి 22) రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఆందోళన.. తెల్లవారుజామున(ఫిబ్రవరి 23) 3 గంటల వరకు సాగింది. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పలువురిని అరెస్టు చేసి వాహనాల్లో తరలించారు. ఆగ్రహానికి గురైన యువత పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు బలగాలను మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టి, మెజార్టీ యువకులను అరెస్టు చేసి మీర్​పేట్, సరూర్​నగర్ పీఎస్‌లకు తరలించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేంత వరకు తాము ఊరుకోబోమని ఆందోళనను కొనసాగిస్తామని గోరక్షక సేవ సమితి సభ్యులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

కర్మన్​ఘాట్​లో ఉద్రిక్తత.. గోరక్షకులపై తరలింపుదారులు దాడి.. పోలీసుల లాఠీఛార్జ్​..

గోవులను అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో హైదరాబాద్​లోని కర్మన్​ఘాట్‌ గోరక్షక సేవాసమితి సభ్యులు.. టీకేఆర్ కమాన్ వద్ద వాహనాన్ని అడ్డగించారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. వాహనాలు దెబ్బతినడంతో పాటు, గోరక్షకులపై తరలింపుదారులు దాడికి పాల్పడ్డారు. గోరక్షకుల నుంచి తప్పించుకునేందుకు తరలింపుదారులు దగ్గరలోని హనుమాన్ ఆలయంలో తలదాచుకున్నారు. వారిని తక్షణమే అదుపులోకి తీసుకోవాలంటూ యువకులు రాత్రంతా నిరసన చేపట్టారు. తమపై దాడికి పాల్పడ్డ దుండగులను వెంటనే అరెస్టు చేయాలని పోలీసులను గోసంరక్షకులు డిమాండ్‌ చేశారు.

మంగళవారం(ఫిబ్రవరి 22) రాత్రి 8 గంటలకు ప్రారంభమైన ఆందోళన.. తెల్లవారుజామున(ఫిబ్రవరి 23) 3 గంటల వరకు సాగింది. ఈ క్రమంలో పోలీసులకు నిరసనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఆందోళనకారులను చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ ఛార్జ్ చేశారు. పలువురిని అరెస్టు చేసి వాహనాల్లో తరలించారు. ఆగ్రహానికి గురైన యువత పోలీసులపై రాళ్లు రువ్వారు. ఈ క్రమంలో ఇద్దరు పోలీసులకు గాయాలయ్యాయి.

పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పలు పోలీస్ స్టేషన్ల నుంచి అదనపు బలగాలను మోహరించారు. ఆందోళనకారులను చెదరగొట్టి, మెజార్టీ యువకులను అరెస్టు చేసి మీర్​పేట్, సరూర్​నగర్ పీఎస్‌లకు తరలించడంతో ఉద్రిక్తత సద్దుమణిగింది. దాడికి పాల్పడిన వారిని అదుపులోకి తీసుకునేంత వరకు తాము ఊరుకోబోమని ఆందోళనను కొనసాగిస్తామని గోరక్షక సేవ సమితి సభ్యులు స్పష్టం చేశారు.

ఇదీ చూడండి:

Last Updated : Feb 23, 2022, 6:19 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.