ETV Bharat / crime

300 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్ట్​ - 300 kgs of Marijuana at bhadrachalam news

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో పోలీసులు 300 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. సుమారు రూ.45 లక్షల విలువ చేసే గంజాయిని తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్​కు తరలించారు.

Seizure of 300 kg of Marijuana by bhadrachalam police
300 కిలోల గంజాయి పట్టివేత.. నలుగురి అరెస్ట్​
author img

By

Published : Mar 21, 2021, 6:54 PM IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఫారెస్ట్ చెక్​పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 300 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. ఒక బొలెరో వాహనం, ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.45 లక్షల వరకు ఉంటుందని సీఐ స్వామి తెలిపారు.

నిందితులంతా ఆంధ్రప్రదేశ్​కు చెందిన వారని సీఐ పేర్కొన్నారు. వీరు గంజాయిని సీలేరులోని పార్వతీనగర్ నుంచి సారపాకకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. వాహనాలను సీజ్​ చేసి, నిందితులను రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ఫారెస్ట్ చెక్​పోస్ట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా 300 కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్ట్​ చేశారు. ఒక బొలెరో వాహనం, ఆటో, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి విలువ సుమారు రూ.45 లక్షల వరకు ఉంటుందని సీఐ స్వామి తెలిపారు.

నిందితులంతా ఆంధ్రప్రదేశ్​కు చెందిన వారని సీఐ పేర్కొన్నారు. వీరు గంజాయిని సీలేరులోని పార్వతీనగర్ నుంచి సారపాకకు తీసుకువెళ్తున్నట్లు తెలిపారు. వాహనాలను సీజ్​ చేసి, నిందితులను రిమాండ్​కు తరలించినట్లు వెల్లడించారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇదీ చూడండి: అడవిలో కార్చిచ్చు.. గ్రామం చుట్టూ మంటలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.