ETV Bharat / crime

ఉన్నతాధికారుల పీఏనంటూ మోసాలు: సీపీ అంజనీకుమార్

author img

By

Published : Mar 30, 2021, 3:18 PM IST

ఉన్నతాధికారుల పీఏనంటూ దాదాపు 82 మందిని మోసం వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.1.03కోట్లు, రూ.కోటి విలువ చేసే ఇంటి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సీపీ అంజనీకుమార్ పేర్కొన్నారు.

Cp anjani kumar
సీపీ అంజనీకుమార్

ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు ఉన్నతాధికారుల వద్ద పనిచేస్తున్నానంటూ ప్రజలను మోసం చేస్తున్న సుధాకర్ అనే వ్యక్తిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరు భీమయ్య, నాగరాజును కూడా అదుపులోకి తీసుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. అధికారుల పేర్లు చెప్పి ఉద్యోగాలు, డబుల్ బెడ్‌ రూం ఇళ్లు, తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని పలు రకాల మోసాలు చేశారని సీపీ పేర్కొన్నారు.

ఈ తరహాలో ఇప్పటివరకు 82 మందిని మోసం చేసినట్లు గుర్తించామన్నారు. బాధితుల నుంచి రూ. 3 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితుల నుంచి రూ. 1.03 కోట్ల నగదు, రూ. కోటి విలువ చేసే ఇళ్ల డాక్యుమెంట్లు, ఫార్చునర్‌ కారు, నకిలీ ఐడీ కార్డులు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నామని... సుధాకర్​పై మూడు కమిషనరేట్ల పరిధుల్లో 8 కేసులున్నట్లు సీపీ వివరించారు.

ముఖ్యమంత్రి కార్యాలయంతోపాటు ఉన్నతాధికారుల వద్ద పనిచేస్తున్నానంటూ ప్రజలను మోసం చేస్తున్న సుధాకర్ అనే వ్యక్తిని ఉత్తర మండలం టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడికి సహకరించిన మరో ఇద్దరు భీమయ్య, నాగరాజును కూడా అదుపులోకి తీసుకున్నామని హైదరాబాద్ సీపీ అంజనీకుమార్ వెల్లడించారు. అధికారుల పేర్లు చెప్పి ఉద్యోగాలు, డబుల్ బెడ్‌ రూం ఇళ్లు, తక్కువ ధరకే బంగారం ఇప్పిస్తామని పలు రకాల మోసాలు చేశారని సీపీ పేర్కొన్నారు.

ఈ తరహాలో ఇప్పటివరకు 82 మందిని మోసం చేసినట్లు గుర్తించామన్నారు. బాధితుల నుంచి రూ. 3 కోట్ల వరకు వసూలు చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితుల నుంచి రూ. 1.03 కోట్ల నగదు, రూ. కోటి విలువ చేసే ఇళ్ల డాక్యుమెంట్లు, ఫార్చునర్‌ కారు, నకిలీ ఐడీ కార్డులు, రబ్బరు స్టాంపులు స్వాధీనం చేసుకున్నామని... సుధాకర్​పై మూడు కమిషనరేట్ల పరిధుల్లో 8 కేసులున్నట్లు సీపీ వివరించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.