ETV Bharat / crime

ముస్తఫానగర్​లో​ రౌడీషీటర్ దారుణహత్య - Telangana news

హైదరాబాద్​ పాతబస్తీ ఫలక్​నుమా పోలీస్​స్టేషన్​ పరిధిలో దారుణహత్య చోటుచేసుకుంది. ఓ రౌడీషీటర్​ను గుర్తుతెలియని వ్యక్తులు కత్తులతో దారుణంగా హతమార్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

ముస్తఫానగర్​లో​ రౌడీషీటర్ దారుణహత్య
ముస్తఫానగర్​లో​ రౌడీషీటర్ దారుణహత్య
author img

By

Published : Mar 12, 2021, 7:57 PM IST

రౌడీషీటర్​ను కత్తులతో దాడి చేసి హతమార్చిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ ఫలక్​నుమా పోలీస్​స్టేషన్ పరిధిలోని ముస్తఫానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కాలపత్తర్​కు చెందిన రౌడీషీటర్​ జబెర్​ను ​గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి కిరాతకంగా హతమార్చారు.

సమాచారం అందుకున్న ఫలక్​నుమా, మైలార్​దేవ్​పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకోవడానికి పోలీస్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నాయి.

రౌడీషీటర్
రౌడీషీటర్ దారుణహత్య

ఇదీ చూడండి: భర్తను హత్య చేసిన కేసులో మరొకరు అరెస్టు

రౌడీషీటర్​ను కత్తులతో దాడి చేసి హతమార్చిన ఘటన హైదరాబాద్ పాతబస్తీ ఫలక్​నుమా పోలీస్​స్టేషన్ పరిధిలోని ముస్తఫానగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. కాలపత్తర్​కు చెందిన రౌడీషీటర్​ జబెర్​ను ​గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో దాడి చేసి కిరాతకంగా హతమార్చారు.

సమాచారం అందుకున్న ఫలక్​నుమా, మైలార్​దేవ్​పల్లి పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకోవడానికి పోలీస్ ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉన్నాయి.

రౌడీషీటర్
రౌడీషీటర్ దారుణహత్య

ఇదీ చూడండి: భర్తను హత్య చేసిన కేసులో మరొకరు అరెస్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.