నిజామాబాద్ జిల్లా ఎడపల్లి బ్రిడ్జి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో శివశంకర్ గౌడ్ అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.
మృతుడు మంగళ్పాడ్ నుంచి బోధన్ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకున్నట్లు ఎస్సై ఎల్లాగౌడ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం బోధన్ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: పెళ్లి చేసుకుందామంటారు.. నమ్మితే ఇక అంతే!