ఆగి ఉన్న ద్విచక్ర వాహనాన్ని వేగంగా వచ్చిన లారీ ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్లోని ఉప్పల్ ఆర్టీఏ కార్యాలయం సమీపంలో ప్రమాదం చోటు చేసుకుంది.

ఎల్బీనగర్ నుంచి వస్తున్న లారీ వాహనదారులపైకి దూసుకెళ్లింది. ప్రధాన రహదారిలో నిలిచిన వాహనాలను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు బైక్లు, కారు, ఆటో, డీసీఎం వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో ఆ మార్గంలో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.