ETV Bharat / crime

బైక్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తల్లి, కుమారుడు మృతి..

author img

By

Published : Apr 2, 2022, 6:22 PM IST

Updated : Apr 3, 2022, 12:02 AM IST

accident
accident

18:18 April 02

బైక్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తల్లి, కుమారుడు మృతి..

Bus Accident: ఉగాది పర్వదినాన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు వద్ద ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో తల్లీకొడుకులు మృతి చెందగా.. తండ్రీకూతురికి తీవ్రగాయాలయ్యాయి. మానకొండూరుకు చెందిన ఆంజనేయులు, భార్య సౌజన్యతో పాటు కుమారుడు, కుమార్తెతో కలిసి కరీంనగర్​ నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ఈ క్రమంలో.. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేయబోతుండగా.. ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది.

ఈ దుర్ఘటనలో తల్లితో పాటు ఏడేళ్ల కుమారుడు యశ్వంత్‌ దుర్మరణం చెందారు. వాహనం నడుపుతున్న అంజనేయులుతో పాటు కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదకరమైన మలుపులో ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పండుగ రోజు కుటుంబంలో ఇద్దరు మృతి చెందటంతో విషాదం నెలకొంది.

ఇదీ చూడండి:

18:18 April 02

బైక్​ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. తల్లి, కుమారుడు మృతి..

Bus Accident: ఉగాది పర్వదినాన ఓ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. కరీంనగర్ జిల్లా మానకొండూరు చెరువు వద్ద ద్విచక్రవాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ఘటనలో తల్లీకొడుకులు మృతి చెందగా.. తండ్రీకూతురికి తీవ్రగాయాలయ్యాయి. మానకొండూరుకు చెందిన ఆంజనేయులు, భార్య సౌజన్యతో పాటు కుమారుడు, కుమార్తెతో కలిసి కరీంనగర్​ నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంపై వస్తున్నాడు. ఈ క్రమంలో.. ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేయబోతుండగా.. ఎదురుగా వస్తున్న మరో ఆర్టీసీ బస్సు ఢీకొంది.

ఈ దుర్ఘటనలో తల్లితో పాటు ఏడేళ్ల కుమారుడు యశ్వంత్‌ దుర్మరణం చెందారు. వాహనం నడుపుతున్న అంజనేయులుతో పాటు కుమార్తెకు తీవ్రగాయాలయ్యాయి. ప్రమాదకరమైన మలుపులో ఓవర్‌టేక్ చేస్తున్న క్రమంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. పండుగ రోజు కుటుంబంలో ఇద్దరు మృతి చెందటంతో విషాదం నెలకొంది.

ఇదీ చూడండి:

Last Updated : Apr 3, 2022, 12:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.