ETV Bharat / crime

అనుమానం వచ్చి భార్యను చంపేశాడు.. ఓ కట్టుకథ అల్లాడు.. చివరికి... - జీడిమెట్లలో భార్యను చంపిన భర్త

Man Killed His Wife : అనుమానం పెనుభూతమైంది. ఆనందంగా సాగుతున్న వారికి జీవితంలో ఆమె పాలిట యమపాశమైంది. భర్త చేతిలో దారుణంగా దెబ్బలు తిన్న ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. విచక్షణారహితంగా హింసించి భార్యను చంపిన అతను.. ఆమె కనిపించడం లేదని కట్టకథ అల్లాడు. చివరకు స్థానికులకు అనుమానం రావడం.. పోలీసులు ఎంటర్ అవ్వడంతో అసలు కథ బయపడింది.

Man Killed His Wife
Man Killed His Wife
author img

By

Published : Apr 30, 2022, 10:28 AM IST

Man Killed His Wife : ఇరవై మూడేళ్ల దాంపత్య జీవితం.. ముగ్గురు పిల్లలు.. సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో అనుమానం చిచ్చురేపింది. శుక్రవారం ఉదయం జరిగిన గొడవలో విచక్షణరహితంగా కొట్టడంతో ఆ ఇల్లాలు ప్రాణాలొదిలింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఠాణా పరిధిలోని గాజులరామారం బతుకమ్మబండలో జరిగిన ఘటన స్థానికులను కలవరపెట్టింది.

విచక్షణారహితంగా కొట్టాడు.. గాజులరామారం బతుకమ్మబండకు చెందిన కర్ణె బాలకృష్ణ, మమత(38)కు 23 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అతను ఏసీ మెకానిక్‌. ఆర్థికంగా ఏ లోటూ లేదు. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. గురువారం నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. మరుసటిరోజు కూడా గొడవ జరగడంతో వాటర్‌ హీటర్‌, ఇంట్లో వస్తువులతో తీవ్రంగా కొట్టాడు. తీవ్రంగా గాయాలవడంతో ఇంట్లోనే కూప్పకూలింది.

Man Killed His Wife
మృతురాలు మమత

హత్య చేసి ఆత్మహత్యగా.. చనిపోయినట్లు నిర్ధారించుకున్న బాలకృష్ణ... ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా స్థానికులు చూసి అడిగారు. బుధవారం రోజు పని మీద బయటకు వెళ్లి అదృశ్యమైందని.. ఆమె కోసం వెతకగా.. చెరువు వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉందని స్థానికులకు చెప్పాడు. అతని వాలకం చూసి అనుమానమొచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో బాలకృష్ణ.. అతడి ఇద్దరి కుమారులను అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి :

Man Killed His Wife : ఇరవై మూడేళ్ల దాంపత్య జీవితం.. ముగ్గురు పిల్లలు.. సాఫీగా సాగిపోతున్న కుటుంబంలో అనుమానం చిచ్చురేపింది. శుక్రవారం ఉదయం జరిగిన గొడవలో విచక్షణరహితంగా కొట్టడంతో ఆ ఇల్లాలు ప్రాణాలొదిలింది. మేడ్చల్ జిల్లా జీడిమెట్ల ఠాణా పరిధిలోని గాజులరామారం బతుకమ్మబండలో జరిగిన ఘటన స్థానికులను కలవరపెట్టింది.

విచక్షణారహితంగా కొట్టాడు.. గాజులరామారం బతుకమ్మబండకు చెందిన కర్ణె బాలకృష్ణ, మమత(38)కు 23 ఏళ్ల క్రితం వివాహమైంది. ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. అతను ఏసీ మెకానిక్‌. ఆర్థికంగా ఏ లోటూ లేదు. భార్యపై అనుమానం పెంచుకున్నాడు. గురువారం నుంచి ఇద్దరి మధ్య గొడవ జరుగుతోంది. మరుసటిరోజు కూడా గొడవ జరగడంతో వాటర్‌ హీటర్‌, ఇంట్లో వస్తువులతో తీవ్రంగా కొట్టాడు. తీవ్రంగా గాయాలవడంతో ఇంట్లోనే కూప్పకూలింది.

Man Killed His Wife
మృతురాలు మమత

హత్య చేసి ఆత్మహత్యగా.. చనిపోయినట్లు నిర్ధారించుకున్న బాలకృష్ణ... ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా స్థానికులు చూసి అడిగారు. బుధవారం రోజు పని మీద బయటకు వెళ్లి అదృశ్యమైందని.. ఆమె కోసం వెతకగా.. చెరువు వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉందని స్థానికులకు చెప్పాడు. అతని వాలకం చూసి అనుమానమొచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో బాలకృష్ణ.. అతడి ఇద్దరి కుమారులను అదుపులోకి తీసుకున్నారు.

ఇవీ చదవండి :

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.