మహరాష్ట్ర మద్యాన్ని అక్రమంగా తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 96 దేశీదారు మద్యం సీసాలు, ఆటోను స్వాధీనం చేసుకున్నారు. కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం సలాబత్పూర్ సరిహద్దులో అబ్కారీ తనిఖీ కేంద్రం వద్ద వారిని పట్టుకున్నారు.
మహారాష్ట్రలోని దెగ్లూర్ ప్రాంతం నుంచి జిల్లాలోని మద్నూర్ మండలం డోంగ్లీ గ్రామానికి ఆటోలో తరలిస్తున్నట్లు అబ్కారీ ఎస్సై నరేష్ తెలిపారు. పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు డోంగ్లీకి చెందిన విఠల్, మరొకరు పోతంగల్కు చెందిన సతీశ్ గౌడ్గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై వెల్లడించారు.