ETV Bharat / crime

పొలానికి వెళ్తుడంగా వాగులో మునిగి రైతు మృతి

ప్రమాదవశాత్తు ఓ రైతు నీట మునిగి మృతి చెందాడు. ఈ ఘటన మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంలో జరిగింది.

Farmer drowns in river and dies in mahabubabad district
నీట మునిగి రైతు మృతి
author img

By

Published : Mar 12, 2021, 10:56 PM IST

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంలో నీట మునిగి రైతు మరణించాడు. బొడ్డితండాకు చెందిన ఆంగోతు చంద్రా (35) వ్యవసాయ పనుల నిమిత్తం.. వాగుకు అవతలి వైపున్న పొలానికి నీటిలోనుంచి నడుచుకుంటూ వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో గల్లంతయ్యాడు.

సాయంకాలమైన ఇంటికి తిరిగిరాకపోవడంతో.. తండావాసులు వాగులో గాలింపు చర్యలు చేపట్టగా మృత దేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వాగు వద్దకు చేరుకుని మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలంలో నీట మునిగి రైతు మరణించాడు. బొడ్డితండాకు చెందిన ఆంగోతు చంద్రా (35) వ్యవసాయ పనుల నిమిత్తం.. వాగుకు అవతలి వైపున్న పొలానికి నీటిలోనుంచి నడుచుకుంటూ వెళ్లాడు. పనులు ముగించుకుని తిరిగి వస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు వాగులో గల్లంతయ్యాడు.

సాయంకాలమైన ఇంటికి తిరిగిరాకపోవడంతో.. తండావాసులు వాగులో గాలింపు చర్యలు చేపట్టగా మృత దేహం లభ్యమైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. వాగు వద్దకు చేరుకుని మృతదేహాన్ని చూసిన కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.

ఇదీ చదవండి: దైవదర్శనం చేసుకుని వస్తుండగా ప్రమాదం... 8మందికి గాయాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.