ETV Bharat / crime

విద్యుదాఘాతంతో పొలంలోనే రైతు మృతి

ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన ఘటన మెదక్ జిల్లాలో చోటు చేసుకుంది. తన వ్యవసాయ బావి వద్ద మోటారు పని చేయకపోవడంతో... స్టాటర్​ను చెక్​ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

author img

By

Published : Mar 25, 2021, 12:14 PM IST

Updated : Mar 25, 2021, 12:36 PM IST

farmer died due to electric shock in Medak district
విద్యుదాఘాతంలో పొలంలోనే రైతు మృతి

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బోగుడ భూపతిపూర్​లోని ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మొగులయ్య(33) తన వ్యవసాయ బావి వద్ద గల మోటారు పని చేయకపోవడంతో... గాండ్ల సుధాకర్​ను తీసుకొని పొలం వద్దకు వెళ్లాడు. ఇద్దరు కలిసి స్టాటర్​ను చెక్​ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొగులయ్య అక్కడికక్కడే మరణించాడు. అతనితో పాటు ఉన్న గాండ్ల సుధాకర్​కు తీవ్రగాయాలు కాగా అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మొగులయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం బోగుడ భూపతిపూర్​లోని ఓ రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. మొగులయ్య(33) తన వ్యవసాయ బావి వద్ద గల మోటారు పని చేయకపోవడంతో... గాండ్ల సుధాకర్​ను తీసుకొని పొలం వద్దకు వెళ్లాడు. ఇద్దరు కలిసి స్టాటర్​ను చెక్​ చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మొగులయ్య అక్కడికక్కడే మరణించాడు. అతనితో పాటు ఉన్న గాండ్ల సుధాకర్​కు తీవ్రగాయాలు కాగా అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు.

మొగులయ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

ఇదీ చదవండి: షేర్ మార్కెట్ పేరుతో మోసం.. రూ.50కోట్లతో శఠగోపం

Last Updated : Mar 25, 2021, 12:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.