ETV Bharat / crime

ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలంటూ బంధువుల ఆందోళన - ఆత్మహత్యకు కారణమైన ఇంటి ఎదుట కుటుంబసభ్యుల ధర్నా

ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారన్న కారణంతో ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. మృతికి కారణమైన వారి ఇంటి ఎదుట ధర్నా చేశారు. నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌కు చెందిన రామచందర్‌(58) మనస్తాపంతో శనివారం బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఆయన మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు.

family members dharna with dead body in front of the house in nagarjuna sagar nalgonda district
మృతదేహంతో ఆందోళన నిర్వహిస్తున్న బంధువులు
author img

By

Published : Jan 24, 2021, 4:59 PM IST

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన వారి ఇంటిముందు మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఎస్టీ, ఎస్టీ కేసు నమోదు చేశారన్న కారణంతో సాగర్‌ నుంచి మాచర్ల వెళ్లే రహదారిలో నూతన వంతెనపై నుంచి దూకి రామచందర్‌(58) ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో ధర్నాకు దిగారు. రామచందర్‌ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు.

ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలంటూ బంధువుల ఆందోళన

ఇటీవలే ఎదురింటి వారితో వివాదం కావడంతో రామచందర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. రాజేందర్‌కు, మృతునికి కేబుల్‌ టీవీ లావాదేవీల వ్యవహారంలో వివాదం ఉంది. దీంతో రాజేందర్‌ కావాలనే ఎదురింటి వారితో గొడవ జరిగేలా చేసి కేసు పెట్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి : ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని వ్యక్తి ఆత్మహత్య

నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు కారణమైన వారి ఇంటిముందు మృతదేహంతో కుటుంబసభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఎస్టీ, ఎస్టీ కేసు నమోదు చేశారన్న కారణంతో సాగర్‌ నుంచి మాచర్ల వెళ్లే రహదారిలో నూతన వంతెనపై నుంచి దూకి రామచందర్‌(58) ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో ధర్నాకు దిగారు. రామచందర్‌ మృతికి కారణమైన వారిని వెంటనే అరెస్ట్ చేయాలంటూ నినాదాలు చేశారు.

ఆత్మహత్యకు కారణమైన వారిని అరెస్ట్ చేయాలంటూ బంధువుల ఆందోళన

ఇటీవలే ఎదురింటి వారితో వివాదం కావడంతో రామచందర్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. రాజేందర్‌కు, మృతునికి కేబుల్‌ టీవీ లావాదేవీల వ్యవహారంలో వివాదం ఉంది. దీంతో రాజేందర్‌ కావాలనే ఎదురింటి వారితో గొడవ జరిగేలా చేసి కేసు పెట్టించాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాధితుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.

ఇదీ చూడండి : ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారని వ్యక్తి ఆత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.