ETV Bharat / crime

వైద్యం వికటించి వ్యక్తి మృతి... ఆస్పత్రి ఎదుట ఆందోళన - తెలంగాణ వార్తలు

వైద్యం వికటించడం వల్లే వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లాలో బాధిత కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చేరితే ఈ ఘటన జరిగిందని వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సమస్యను పరిష్కరించారు.

deceased-person-family-members-protest-at-metpally-hospital-in-jagtial-district
వైద్యం వికటించి వ్యక్తి మృతి... ఆస్పత్రి ఎదుట ఆందోళన
author img

By

Published : Feb 27, 2021, 7:19 PM IST

వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళకు దిగారు. నాలుగు రోజుల క్రితం మల్లాపూర్ మండలం సిరిపూర్​కి చెందిన గంగరాజం అనే వ్యక్తికి హెర్నియా ఆపరేషన్ చేశారని బాధితులు పేర్కొన్నారు. రెండు రోజుల తర్వాత అనారోగ్య సమస్యలు రావడం వల్ల కరీంనగర్​కు తీసుకెళ్లాలని చెప్పారని పేర్కొన్నారు.

కరీంనగర్ తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో గంగరాజం మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు సర్దిజెప్పి సమస్యను పరిష్కరించారు.

వైద్యం వికటించి ఓ వ్యక్తి మృతి చెందాడని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా మెట్​పల్లిలోని ఓ ప్రైవేటు ఆస్పత్రి ఎదుట బాధిత కుటుంబ సభ్యులు ఆందోళకు దిగారు. నాలుగు రోజుల క్రితం మల్లాపూర్ మండలం సిరిపూర్​కి చెందిన గంగరాజం అనే వ్యక్తికి హెర్నియా ఆపరేషన్ చేశారని బాధితులు పేర్కొన్నారు. రెండు రోజుల తర్వాత అనారోగ్య సమస్యలు రావడం వల్ల కరీంనగర్​కు తీసుకెళ్లాలని చెప్పారని పేర్కొన్నారు.

కరీంనగర్ తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో గంగరాజం మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ముందు ఆందోళకు దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధిత కుటుంబ సభ్యులకు సర్దిజెప్పి సమస్యను పరిష్కరించారు.

ఇదీ చదవండి: కలప దొంగలతో ఉన్న ఆ నలుగురు ఎవరు..?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.