ఆంధ్రప్రదేశ్లోని తూర్పు గోదావరి జిల్లా కాకినాడ సర్పవరం రసాయన పరిశ్రమలో బాయిలర్ పేలింది. ఈ ఘటనలో ఇద్దరు కార్మికులు మృతి చెందగా.. మరో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
క్షతగాత్రులను మాధవపట్నంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాయిలర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. విషయం తెలిసిన వెంటనే.. మంత్రి కన్నబాబు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు పర్యవేక్షించారు.
ఇదీ చదవండి: అదుపు తప్పి ద్విచక్రవాహనాన్ని ఢీకొన్న లారీ