ETV Bharat / crime

మరో మరణం: బ్లాక్​ ఫంగస్​తో వృద్ధురాలి మృతి

author img

By

Published : May 24, 2021, 7:40 PM IST

రాష్ట్రంలో బ్లాక్​ ఫంగస్​ మరణాలు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. తాజాగా నిర్మల్‌ జిల్లాలో ఓ వృద్ధురాలు బ్లాక్​ ఫంగస్​తో మృతి చెందింది. కరోనాను జయించినా.. ఫంగస్​ను ఎదుర్కోలేక ప్రాణాలు విడిచింది.

బ్లాక్​ ఫంగస్​తో వృద్ధురాలి మృతి
బ్లాక్​ ఫంగస్​తో వృద్ధురాలి మృతి

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రాహుల్‌ నగర్‌లో బ్లాక్‌ ఫంగస్‌తో గజన్‌ బాయి అనే వృద్ధురాలు మృతి చెందింది. కోతుల్గాం గ్రామానికి చెందిన గజన్ బాయికి గత నెలలో కరోనా సోకగా.. పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందింది. వైరస్‌ను జయించి ఈ నెల 5న ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జీ అయింది.

కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఎంతకూ తగ్గకపోవడంతో 5 రోజుల క్రితం నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించారు. ఆసుపత్రిలో చేర్పించలేక ఇంటి వద్దే చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమించి మృతి చెందింది.

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని రాహుల్‌ నగర్‌లో బ్లాక్‌ ఫంగస్‌తో గజన్‌ బాయి అనే వృద్ధురాలు మృతి చెందింది. కోతుల్గాం గ్రామానికి చెందిన గజన్ బాయికి గత నెలలో కరోనా సోకగా.. పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందింది. వైరస్‌ను జయించి ఈ నెల 5న ఆసుపత్రి నుంచి డిశ్ఛార్జీ అయింది.

కొన్ని రోజుల క్రితం జ్వరం రావడంతో ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. ఎంతకూ తగ్గకపోవడంతో 5 రోజుల క్రితం నిజామాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో పరీక్షలు చేయించారు. వైద్యులు బ్లాక్ ఫంగస్‌గా నిర్ధారించారు. ఆసుపత్రిలో చేర్పించలేక ఇంటి వద్దే చికిత్స అందిస్తుండగా.. పరిస్థితి విషమించి మృతి చెందింది.

ఇదీ చూడండి: మేమున్నామంటూ... కరోనా బాధితులకు ఇంటివద్దకే భోజనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.