ROAD ACCIDENT: కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 21 మందికి గాయాలయ్యాయి. వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగింది. టాటాఏస్ వాహనం -కారు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది.
బాధితులు మహబూబాబాద్, ములుగు జిల్లాలు, శాయంపేటకు చెందినవారిగా గుర్తించారు. ప్రమాద సమయంలో టాటాఏస్ వాహనంలో 15 మంది, కారులో ఐదుగురు ఉన్నారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. గాయపడిన వారిని 108లో ఆసుపత్రికి తరలించారు