నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలంలోని బుడ్డ తండా గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కొవిడ్ బారిన పడి మృతి చెందాడు. మృతుడు వృత్తి రీత్యా హైదరాబాద్లో ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. అక్కడ జ్వరం రావడంతో పరీక్షలు చేయగా వైద్యులు కొవిడ్గా నిర్ధరణ చేశారు.
దీనితో ఈ నెల 13న సొంత గ్రామం బుడ్డ తండాకు వచ్చి స్వీయ నిర్భంధంలో ఉన్నాడు. శుక్రవారం రాత్రి ఆరోగ్యం క్షీణించడంతో 9గంటలకు మరణించాడు. మృతునికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం కరోనాతో మండలానికి చెందిన ఓ హాస్టల్ వార్డెన్ కూడా హైదరాబాద్లో చికిత్స పొందుతూ మృత్యువాత పడ్డాడు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ కొరతతో ఆరుగురు రోగులు మృతి