ETV Bharat / crime

పెద్దపల్లి జిల్లాలో భారీ కుంభకోణం.. ఎఫ్​సీఐకి ఎగనామం పెట్టిన కేటుగాడు

author img

By

Published : Apr 24, 2022, 3:26 AM IST

custom rice milling scandal: పెద్దపల్లి జిల్లాలో భారీ కుంభకోణం బయటపడింది. పౌరసరఫరాల శాఖ సీఎంఆర్ కింద రైస్ మిల్లుకు ఇచ్చిన ధాన్యాన్ని బియ్యంగా మార్చి ఎఫ్​సీఐకి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ మిల్లు యజమాని బియ్యంను బహిరంగ మార్కెట్​లో అమ్ముకున్న వైనం బహిర్గతమైంది.

rice mill
లక్ష్మీనర్సింహ రైస్ మిల్లు

custom rice milling scandal: పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలోని లక్ష్మీనర్సింహ రైస్ మిల్లులో కస్టమ్ రైస్ మిల్లింగ్ కుంభకోణం బయటపడింది. పౌరసరఫరాల శాఖ సీఎంఆర్ కింద రైస్ మిల్లుకు ఇచ్చిన వడ్లను బియ్యంగా మార్చి ఎఫ్​సీఐకి ఇవ్వాలి. లెవీ పెట్టాల్సిన బియ్యంను మిల్లు యజమాని బహిరంగ మార్కెట్​లో అమ్ముకున్న వైనం బహిర్గతమైంది. లెవీ బియ్యంపై ఫిర్యాదులు రావడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. రైస్ మిల్​కు అప్పగించిన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. లక్ష్మీనరసింహ ఇండస్ట్రీస్​కు పౌరసరఫరాల శాఖ 91,258 క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయించారు. రూ.5,95,98,278 విలువ గల 21,100 క్వింటాళ్ల బియ్యంను మాయం చేశారు.

మిల్లు యజమాని ఎఫ్​సీఐకి బియ్యాన్ని చెల్లించాల్సిన గడువు పూర్తయినప్పటికీ అప్పగించకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. దీంతో గతంలోనే అధికారులు తనిఖీలు చేపట్టారు. బియ్యం అప్పగించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. కానీ మిల్లు యాజమాన్యంలో మార్పు రాకపోవడంతో శనివారం సుల్తానాబాద్ పోలీస్​స్టేషన్​లో పౌరసరఫరాల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలోని మరిన్ని రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తే పెద్దఎత్తున కుంభకోణాలు బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

custom rice milling scandal: పెద్దపల్లి జిల్లాలో సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామంలోని లక్ష్మీనర్సింహ రైస్ మిల్లులో కస్టమ్ రైస్ మిల్లింగ్ కుంభకోణం బయటపడింది. పౌరసరఫరాల శాఖ సీఎంఆర్ కింద రైస్ మిల్లుకు ఇచ్చిన వడ్లను బియ్యంగా మార్చి ఎఫ్​సీఐకి ఇవ్వాలి. లెవీ పెట్టాల్సిన బియ్యంను మిల్లు యజమాని బహిరంగ మార్కెట్​లో అమ్ముకున్న వైనం బహిర్గతమైంది. లెవీ బియ్యంపై ఫిర్యాదులు రావడంతో పౌరసరఫరాల శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు. రైస్ మిల్​కు అప్పగించిన సీఎంఆర్ ధాన్యం మాయమైనట్లు అధికారులు గుర్తించారు. లక్ష్మీనరసింహ ఇండస్ట్రీస్​కు పౌరసరఫరాల శాఖ 91,258 క్వింటాళ్ల ధాన్యాన్ని కేటాయించారు. రూ.5,95,98,278 విలువ గల 21,100 క్వింటాళ్ల బియ్యంను మాయం చేశారు.

మిల్లు యజమాని ఎఫ్​సీఐకి బియ్యాన్ని చెల్లించాల్సిన గడువు పూర్తయినప్పటికీ అప్పగించకపోవడంతో అనుమానం వ్యక్తం చేశారు. దీంతో గతంలోనే అధికారులు తనిఖీలు చేపట్టారు. బియ్యం అప్పగించాలంటూ హెచ్చరికలు జారీ చేశారు. కానీ మిల్లు యాజమాన్యంలో మార్పు రాకపోవడంతో శనివారం సుల్తానాబాద్ పోలీస్​స్టేషన్​లో పౌరసరఫరాల శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలోని మరిన్ని రైస్ మిల్లుల్లో తనిఖీలు నిర్వహిస్తే పెద్దఎత్తున కుంభకోణాలు బహిర్గతమయ్యే అవకాశాలు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చదవండి: farmers suffered: మిల్లర్ల మాయాజాలం పంటకు దక్కేనా మద్దతు 'ధర'హాసం

తల్లి చదివిన స్కూల్​కు హైటెక్​ హంగులు.. రూ.2కోట్లతో కొత్త భవనం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.