ETV Bharat / crime

వివాహేతర సంబంధంతో హత్య.. కేసును తప్పించేందుకు మరో హత్య.. చివరికి..

author img

By

Published : Oct 4, 2022, 4:15 PM IST

Twists in Murder Case: వివాహేతర సంబంధం హత్యకు దారి తీసింది. రిమాండ్​లో ఉన్న వ్యక్తిని కేసు నుంచి తప్పించేందుకు.. ఓ వ్యక్తి అతని కుటుంబ సభ్యులను కలిశాడు. భారీ మొత్తంలో డబ్బు తీసుకున్నాడు. ఈ విషయం తెలిసి మరింత తక్కువకే తాను ఈ కేసు పరిష్కరిస్తానని ఏకంగా నిందితుడినే కలిశాడు. ఈ విషయం మొదటి వ్యక్తికి తెలియడంతో రెండో వ్యక్తి హత్యకు పథకం వేశాడు.. అనుకున్న విధంగానే కడతేర్చాడు.

Murder
Murder

Twists in Murder Case: ఏపీలోని కృష్ణా జిల్లాలో సంచలనం రేపిన తోట్లవల్లూరు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఈ హత్య అప్పట్లో కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులతో రాజీ కుదిర్చేందుకు ఇద్దరు దళారులు పోటీ పడిన నేపథ్యంలో.. మరో హత్య జరిగిన విషయం తాజాగా వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడైన శ్రీకాంత్‌రెడ్డిని విడిపిస్తానంటూ నరేంద్రరెడ్డి అనే వ్యక్తి మృతుడి కుటుంబ సభ్యులను సంప్రదించాడు. కేసును విచారిస్తున్న సీఐకు రూ.22 లక్షలు కూడా అందజేశాడని తెలిసింది.

ఈ సమయంలో రంగ ప్రవేశం చేసిన మరో దళారి శ్రీనివాసరెడ్డి.. తాను ఇంకా తక్కువ ధరకే పోలీసులతో రాజీ చేస్తానని చెప్పినట్టు తెలిసింది. తన డీల్‌కు శ్రీనివాసరెడ్డి అడ్డు వస్తున్నాడని భావించిన నరేంద్ర రెడ్డి.. సెప్టెంబరు 20న అతడిని హత్య చేసి.. మృతదేహాన్ని పూడ్చాడు. ఆ తర్వాత విషయం బయటకు పొక్కడంతో పోలీసులు నరేంద్రరెడ్డితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్న సమయంలో పోలీసులతో నరేంద్రరెడ్డికి డీల్‌ కుదిరిన విషయం బయటకొచ్చింది. విషయం ఎస్పీ వరకూ వెళ్లడంతో ఆయన రహస్యంగా విచారణ జరిపిస్తున్నట్లు తెలిసింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు ఎస్సై, సీఐలను వీఆర్‌కు పంపించారు. ఈ ఉదంతంలో మరికొందరు పోలీసులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే: ఈ ఏడాది జులై, 26వ తేదీ తెల్లవారుజామున.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెంలో సాఫ్ట్​వేర్‌ ఉద్యోగి గడికొయ్య శ్రీనివాసరెడ్డి (38) హత్యకు గురయ్యాడు. కొవిడ్‌ కారణంగా శ్రీనివాసరెడ్డి .. ఆళ్లవారిపాలెంకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి చిన్ననాటి నుంచి స్నేహితులు. శ్రీకాంత్‌రెడ్డి ఊళ్లో ఉంటూ వ్యవసాయం చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన మిథున అలియాస్‌ జ్యోతితో శ్రీకాంత్‌రెడ్డికి వివాహేతర సంబంధం ఉండేది. ఓసారి శ్రీకాంత్‌రెడ్డి ఫోన్‌ మొరాయించడంతో దానిని శ్రీనివాసరెడ్డి వద్దకు తీసుకెళ్లాడు. అందులో వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూశాడు. వాటిని చూపించి, శ్రీనివాసరెడ్డి మిథునను లొంగదీసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డికి భయపడి శ్రీకాంత్‌రెడ్డిని మిథున దూరం పెట్టింది. తర్వాత అసలు విషయం తెలుసుకున్న శ్రీకాంత్‌రెడ్డి.. తన మిత్రుడు శ్రీనివాసరెడ్డిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. మిథునతో ఫోన్‌ చేయించి జులై, 25వ తేదీ రాత్రి శ్రీనివాసరెడ్డిని ఇంటికి రప్పించారు. తెల్లవారుజామున అక్కడికి వచ్చిన శ్రీనివాసరెడ్డిని శ్రీకాంత్‌రెడ్డి హతమార్చాడు. అనంతరం మిథునను తీసుకుని పరారయ్యాడు. ఈ కేసులో శ్రీకాంత్‌రెడ్డి, మిథునలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

కేసును నీరుగారుస్తానని హత్య: ఈ కేసును నీరుగార్చి, రాజీ చేస్తానని భద్రిరాజుపాలెం గ్రామానికి నరేంద్రరెడ్డి తెరపైకి వచ్చాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడతానని ఖర్చు అవుతుందని నిందితుడి తండ్రిని సంప్రదించాడు. ఈ మేరకు వారి మధ్య డీల్‌ కుదిరింది. తొలి విడతగా కేసును విచారిస్తున్న సీఐతో రూ. 22 లక్షలకు మాట్లాడుకున్నాడు. ఈమేరకు సీఐకు నరేంద్రరెడ్డి డబ్బులు అందజేశాడు. ఇంతలో.. ఇదే గ్రామానికి చెందిన పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి విషయం తెలిసి రిమాండ్‌లో ఉన్న నిందితుడిని కలిశాడు. తాను రూ.20 లక్షలకే రాజీ చేస్తానని నిందితుడితో చెప్పాడు. దీనిని పసిగట్టిన నరేంద్రరెడ్డి.. తన డీల్‌కు పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి అడ్డు వస్తున్నాడని భావించి చంపాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. తన కారు అయితే అందులో రావడానికి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి ఒప్పుకొడనే అనుమానంతో తోట్లవల్లూరుకు చెందిన ఓ వైకాపా నాయకుడి కారును నరేంద్రరెడ్డి తీసుకున్నాడు.

సెప్టెంబరు 20వ తేదీ రాత్రి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డిని రప్పించి డీల్‌ మాట్లాడాలి అంటూ కారు ఎక్కించుకున్నారు. నరేంద్రరెడ్డి మాటలు కలుపుతూనే పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కుక్కగొలుసును మెడకు వేసి హత్య చేశారు. గతంలో పరిచయం ఉన్నా జేసీబీ యువకుడికి నరేంద్రరెడ్డి ఫోన్‌ చేసి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి వివరాలు తెలిపాడు. వెంటనే ఆత్కూరు శివారు బలిపర్రు గ్రామానికి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని తీసుకురమ్మని ఆ యువకుడు చెప్పాడు. వారు వెళ్లే సమయానికి చెరువు వద్ద జేసీబీ యువకుడు గుంత తవ్వి సిద్ధంగా ఉంచాడు. దానిలో పుచ్చకాయల శ్రీనివాసరెడ్డిని మృతదేహాన్ని పూడ్చారు. అనంతరం పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి హత్య విషయం బయటకు వచ్చింది. రంగంలోకి దిగిన ఆత్కూరు పోలీసులు నిందితుడు నరేంద్రరెడ్డితో పాటు సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు

విచారిస్తుండగా బయట పడిన అసలు నిజం: ఆత్కూరు పోలీసులు నరేంద్రరెడ్డి అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా.. గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్య డీల్‌ విషయం తెలిసి అశ్యర్యపోయారు. నిందితుడు నరేంద్రరెడ్డి విచారణలో పలు అంశాలను విచారణ అధికారికి వెల్లడించినట్లు సమాచారం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్య కేసును నీరుగార్చేందుకు సీఐకు తాను రూ. 22 లక్షలు ఇచ్చినట్లు నరేంద్రరెడ్డి విచారణలో వెల్లడించాడు. గడికొయ్య శ్రీనివాసరెడ్డి ఆత్కూరు పోలీసులు కృష్ణా ఎస్పీ జాషువా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన రహస్యంగా విచారణ జరిపిస్తున్నట్లు తెలిసింది.

హత్య కేసులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు ఎస్సై, సీఐలను వీఆర్‌కు పంపించారు. విషయం తెలిసీ ఉన్నతాధికారులకు తెలియజేయనందుకు ఎస్సైపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో విచారణ బాధ్యతను అదనపు ఎస్పీకి అప్పగించారు. నిందితులు పోలీసులకు డబ్బులు ఎలా ఇచ్చారు.. పోలీసులకు నిందితులకు మధ్య లావాదేవిలు ఎలా జరిగాయనే వివరాలను అదనపు ఎస్పీ రాబట్టారు. ఇందులో బ్యాంకు లావాదేవీలు కీలకంగా మారాయి. ఈ వ్యవహారంలో మరికొంతమంది పోలీసులపై వేటు పడే అవకాశం ఉందని సమాచారం.

ఇవీ చదవండి:

Twists in Murder Case: ఏపీలోని కృష్ణా జిల్లాలో సంచలనం రేపిన తోట్లవల్లూరు హత్య కేసు కీలక మలుపు తిరిగింది. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరిగిన ఈ హత్య అప్పట్లో కలకలం రేపింది. ఈ కేసులో పోలీసులతో రాజీ కుదిర్చేందుకు ఇద్దరు దళారులు పోటీ పడిన నేపథ్యంలో.. మరో హత్య జరిగిన విషయం తాజాగా వెలుగు చూసింది. ఈ కేసులో నిందితుడైన శ్రీకాంత్‌రెడ్డిని విడిపిస్తానంటూ నరేంద్రరెడ్డి అనే వ్యక్తి మృతుడి కుటుంబ సభ్యులను సంప్రదించాడు. కేసును విచారిస్తున్న సీఐకు రూ.22 లక్షలు కూడా అందజేశాడని తెలిసింది.

ఈ సమయంలో రంగ ప్రవేశం చేసిన మరో దళారి శ్రీనివాసరెడ్డి.. తాను ఇంకా తక్కువ ధరకే పోలీసులతో రాజీ చేస్తానని చెప్పినట్టు తెలిసింది. తన డీల్‌కు శ్రీనివాసరెడ్డి అడ్డు వస్తున్నాడని భావించిన నరేంద్ర రెడ్డి.. సెప్టెంబరు 20న అతడిని హత్య చేసి.. మృతదేహాన్ని పూడ్చాడు. ఆ తర్వాత విషయం బయటకు పొక్కడంతో పోలీసులు నరేంద్రరెడ్డితో పాటు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. వారిని విచారిస్తున్న సమయంలో పోలీసులతో నరేంద్రరెడ్డికి డీల్‌ కుదిరిన విషయం బయటకొచ్చింది. విషయం ఎస్పీ వరకూ వెళ్లడంతో ఆయన రహస్యంగా విచారణ జరిపిస్తున్నట్లు తెలిసింది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు ఎస్సై, సీఐలను వీఆర్‌కు పంపించారు. ఈ ఉదంతంలో మరికొందరు పోలీసులపై వేటు పడే అవకాశం ఉందని తెలుస్తోంది.

అసలేం జరిగిందంటే: ఈ ఏడాది జులై, 26వ తేదీ తెల్లవారుజామున.. కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు శివారు ఆళ్లవారిపాలెంలో సాఫ్ట్​వేర్‌ ఉద్యోగి గడికొయ్య శ్రీనివాసరెడ్డి (38) హత్యకు గురయ్యాడు. కొవిడ్‌ కారణంగా శ్రీనివాసరెడ్డి .. ఆళ్లవారిపాలెంకు చెందిన శ్రీకాంత్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి చిన్ననాటి నుంచి స్నేహితులు. శ్రీకాంత్‌రెడ్డి ఊళ్లో ఉంటూ వ్యవసాయం చేస్తుంటాడు. అదే గ్రామానికి చెందిన మిథున అలియాస్‌ జ్యోతితో శ్రీకాంత్‌రెడ్డికి వివాహేతర సంబంధం ఉండేది. ఓసారి శ్రీకాంత్‌రెడ్డి ఫోన్‌ మొరాయించడంతో దానిని శ్రీనివాసరెడ్డి వద్దకు తీసుకెళ్లాడు. అందులో వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫొటోలను చూశాడు. వాటిని చూపించి, శ్రీనివాసరెడ్డి మిథునను లొంగదీసుకున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాసరెడ్డికి భయపడి శ్రీకాంత్‌రెడ్డిని మిథున దూరం పెట్టింది. తర్వాత అసలు విషయం తెలుసుకున్న శ్రీకాంత్‌రెడ్డి.. తన మిత్రుడు శ్రీనివాసరెడ్డిని చంపేందుకు నిర్ణయించుకున్నాడు. మిథునతో ఫోన్‌ చేయించి జులై, 25వ తేదీ రాత్రి శ్రీనివాసరెడ్డిని ఇంటికి రప్పించారు. తెల్లవారుజామున అక్కడికి వచ్చిన శ్రీనివాసరెడ్డిని శ్రీకాంత్‌రెడ్డి హతమార్చాడు. అనంతరం మిథునను తీసుకుని పరారయ్యాడు. ఈ కేసులో శ్రీకాంత్‌రెడ్డి, మిథునలను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు.

కేసును నీరుగారుస్తానని హత్య: ఈ కేసును నీరుగార్చి, రాజీ చేస్తానని భద్రిరాజుపాలెం గ్రామానికి నరేంద్రరెడ్డి తెరపైకి వచ్చాడు. పోలీసులు, మృతుడి కుటుంబ సభ్యులతో మాట్లాడతానని ఖర్చు అవుతుందని నిందితుడి తండ్రిని సంప్రదించాడు. ఈ మేరకు వారి మధ్య డీల్‌ కుదిరింది. తొలి విడతగా కేసును విచారిస్తున్న సీఐతో రూ. 22 లక్షలకు మాట్లాడుకున్నాడు. ఈమేరకు సీఐకు నరేంద్రరెడ్డి డబ్బులు అందజేశాడు. ఇంతలో.. ఇదే గ్రామానికి చెందిన పుచ్చకాయల శ్రీనివాసరెడ్డికి విషయం తెలిసి రిమాండ్‌లో ఉన్న నిందితుడిని కలిశాడు. తాను రూ.20 లక్షలకే రాజీ చేస్తానని నిందితుడితో చెప్పాడు. దీనిని పసిగట్టిన నరేంద్రరెడ్డి.. తన డీల్‌కు పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి అడ్డు వస్తున్నాడని భావించి చంపాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. తన కారు అయితే అందులో రావడానికి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి ఒప్పుకొడనే అనుమానంతో తోట్లవల్లూరుకు చెందిన ఓ వైకాపా నాయకుడి కారును నరేంద్రరెడ్డి తీసుకున్నాడు.

సెప్టెంబరు 20వ తేదీ రాత్రి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డిని రప్పించి డీల్‌ మాట్లాడాలి అంటూ కారు ఎక్కించుకున్నారు. నరేంద్రరెడ్డి మాటలు కలుపుతూనే పథకం ప్రకారం వెంట తెచ్చుకున్న కుక్కగొలుసును మెడకు వేసి హత్య చేశారు. గతంలో పరిచయం ఉన్నా జేసీబీ యువకుడికి నరేంద్రరెడ్డి ఫోన్‌ చేసి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి వివరాలు తెలిపాడు. వెంటనే ఆత్కూరు శివారు బలిపర్రు గ్రామానికి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి మృతదేహాన్ని తీసుకురమ్మని ఆ యువకుడు చెప్పాడు. వారు వెళ్లే సమయానికి చెరువు వద్ద జేసీబీ యువకుడు గుంత తవ్వి సిద్ధంగా ఉంచాడు. దానిలో పుచ్చకాయల శ్రీనివాసరెడ్డిని మృతదేహాన్ని పూడ్చారు. అనంతరం పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి హత్య విషయం బయటకు వచ్చింది. రంగంలోకి దిగిన ఆత్కూరు పోలీసులు నిందితుడు నరేంద్రరెడ్డితో పాటు సహకరించిన మరో ముగ్గురిని అరెస్టు చేశారు

విచారిస్తుండగా బయట పడిన అసలు నిజం: ఆత్కూరు పోలీసులు నరేంద్రరెడ్డి అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా.. గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్య డీల్‌ విషయం తెలిసి అశ్యర్యపోయారు. నిందితుడు నరేంద్రరెడ్డి విచారణలో పలు అంశాలను విచారణ అధికారికి వెల్లడించినట్లు సమాచారం. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గడికొయ్య శ్రీనివాసరెడ్డి హత్య కేసును నీరుగార్చేందుకు సీఐకు తాను రూ. 22 లక్షలు ఇచ్చినట్లు నరేంద్రరెడ్డి విచారణలో వెల్లడించాడు. గడికొయ్య శ్రీనివాసరెడ్డి ఆత్కూరు పోలీసులు కృష్ణా ఎస్పీ జాషువా దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన రహస్యంగా విచారణ జరిపిస్తున్నట్లు తెలిసింది.

హత్య కేసులో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించినందుకు ఎస్సై, సీఐలను వీఆర్‌కు పంపించారు. విషయం తెలిసీ ఉన్నతాధికారులకు తెలియజేయనందుకు ఎస్సైపై ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ వ్యవహారంలో విచారణ బాధ్యతను అదనపు ఎస్పీకి అప్పగించారు. నిందితులు పోలీసులకు డబ్బులు ఎలా ఇచ్చారు.. పోలీసులకు నిందితులకు మధ్య లావాదేవిలు ఎలా జరిగాయనే వివరాలను అదనపు ఎస్పీ రాబట్టారు. ఇందులో బ్యాంకు లావాదేవీలు కీలకంగా మారాయి. ఈ వ్యవహారంలో మరికొంతమంది పోలీసులపై వేటు పడే అవకాశం ఉందని సమాచారం.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.