జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సంగారెడ్డి జిల్లా పాలనాధికారి, ఎన్నికల రిటర్నింగ్ అధికారి హనుమంతరావు అన్నారు. లోక్సభ నియోజకవర్గం పరిధిలో 1943 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా అందులో 233 కేంద్రాలను సమస్యాత్మకమైనవి గుర్తించామని తెలిపారు. ఎన్నికల నిర్వహణకు 8471 మంది సిబ్బంది అవసరం కాగా అంతకంటే ఎక్కువగానే తీసుకున్నట్లు పేర్కొన్నారు. భద్రత కోసం ఇప్పటికే రెండు కేంద్ర, మూడు గోవా కు చెందిన బలగాలు వచ్చాయన్నారు. పఠాన్చెరు రుద్రారంలోని గీతం విశ్వవిద్యాలయంలో స్ట్రాంగ్ రూమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఇవీ చూడండి:"మోదీ ప్రధాని కాదు... దొంగలకు చౌకీదార్"