ETV Bharat / city

పిల్లల విభాగానికి వెంటిలేటర్..​ అందించిన వైద్యుల సంఘం!

author img

By

Published : Sep 5, 2020, 4:34 PM IST

తెలంగాణ పిల్లల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో నిజామాబాద్​ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి పిల్లల విభాగానికి అధునాతన వెంటిలేటర్​ అందించారు. పిల్లలకు అత్యవసర చికిత్స సమయంలో అవసరమయ్యే అధునాతన వెంటిలేటర్​ను నిజామాబాద్​, కరీంనగర్​ ప్రభుత్వ ఆస్పత్రుల పిల్లల విభాగానికి ఒక్కొక్కటి చొప్పున అందించినట్టు తెలంగాణ పిల్లల వైద్యుల సంఘం అధ్యక్షులు లక్ష్మణ్​ తెలిపారు.

Telangana Childrens Specialists Donates Ventilator To Nizamabad And Karimnagar Hospitals
పిల్లల విభాగానికి వెంటిలేటర్..​ అందించిన వైద్యుల సంఘం!

నిజామాబాద్​ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని పిల్లల విభాగానికి.. తెలంగాణ పిల్లల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో అధునాతన వెంటిలేటర్​ అందించారు. నిజామాబాద్​, కరీంనగర్​ ప్రభుత్వ ఆస్పత్రులకు ఒక్కొక్కటి చొప్పున వెంటిలేటర్​ అందించినట్టు సంఘం అధ్యక్షులు లక్ష్మణ్​ తెలిపారు. ప్రస్తుత కొవిడ్​ నేపథ్యంలో పిల్లలకు అత్యవసర చికిత్స నిమిత్తం రూ.4 లక్షలు విలువ చేసే.. వెంటిలేటర్​ అందించినట్టు నిజామాబాద్​ జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్​ ప్రతిమారాజ్​ అన్నారు. ఇప్పటి వరకు అధునాతన వెంటిలేటర్​ సౌకర్యం హైదరాబాద్​, వరంగల్​లో మాత్రమే ఉండేదని.. ఇప్పుడు నిజామాబాద్​, కరీంనగర్​ ప్రభుత్వ ఆస్పత్రులకు కూడా అందించామని తెలంగాణ పిల్లల వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి యశ్వంత్​ రావు అన్నారు.

నిజామాబాద్​ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలోని పిల్లల విభాగానికి.. తెలంగాణ పిల్లల వైద్యుల సంఘం ఆధ్వర్యంలో అధునాతన వెంటిలేటర్​ అందించారు. నిజామాబాద్​, కరీంనగర్​ ప్రభుత్వ ఆస్పత్రులకు ఒక్కొక్కటి చొప్పున వెంటిలేటర్​ అందించినట్టు సంఘం అధ్యక్షులు లక్ష్మణ్​ తెలిపారు. ప్రస్తుత కొవిడ్​ నేపథ్యంలో పిల్లలకు అత్యవసర చికిత్స నిమిత్తం రూ.4 లక్షలు విలువ చేసే.. వెంటిలేటర్​ అందించినట్టు నిజామాబాద్​ జిల్లా ఆస్పత్రి సూపరిండెంట్​ ప్రతిమారాజ్​ అన్నారు. ఇప్పటి వరకు అధునాతన వెంటిలేటర్​ సౌకర్యం హైదరాబాద్​, వరంగల్​లో మాత్రమే ఉండేదని.. ఇప్పుడు నిజామాబాద్​, కరీంనగర్​ ప్రభుత్వ ఆస్పత్రులకు కూడా అందించామని తెలంగాణ పిల్లల వైద్యుల సంఘం రాష్ట్ర కార్యదర్శి యశ్వంత్​ రావు అన్నారు.

ఇవీ చూడండి: మంత్రి హరీశ్‌రావుకు కరోనా పాజిటివ్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.