ETV Bharat / city

ధాన్యం కొనుగోలు కేంద్రాలు తనిఖీ చేసిన కలెక్టర్ నారాయణ రెడ్డి - nizamabad district collector narayana reddy latest

ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ జిల్లా పాలనాధికారి నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు పాటించాలని.. మిల్లర్లకు తరుగు తీసుకునే అవకాశం ఇవ్వకూడదని రైతులకు సూచించారు.

nizamabad district collector narayana reddy visited ikp centers
ధాన్యం కొనుగోలు కేంద్రాల ఆకస్మిక తనిఖీ: కలెక్టర్
author img

By

Published : Oct 27, 2020, 10:29 PM IST

బొర్గం, ధర్మారం(బి) గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా బొర్గం గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి.. అక్కడ ఏర్పాటు చేసిన వసతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటర్, షెడ్, తాడిపత్రి, వెయింగ్ మిషన్, రిజిస్టర్​ను పరిశీలించారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి:

ధాన్యం 445 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, జిల్లాలోని 247 రైస్ మిల్లర్లకు కేటాయిస్తుందన్నారు. భారత ఆహార సంస్థ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. తేమ 17 శాతంలోపు, తాలు ఒక శాతంలోపు ఉండాలని సూచించారు. అట్టి సన్న రకం ధాన్యాన్ని ఏ గ్రేడ్​గా పరిగణించి క్వింటాలుకు రూ.1,888, సాధారణ రకం ఐతే 1,868 రూపాయలు రైతులకు ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. జిల్లాలోని రైతు సోదరులందరూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, రైతు మిల్లర్లకు తరుగు తీసుకునే అవకాశం ఇవ్వకూడదని సూచించారు. తరుగు, కడ్త పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేసే రైస్ మిల్లర్లను సీజ్ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎట్టి పరిస్థితిలోనూ తరుగు తీయొద్దు:

కొనుగోలు కేంద్రాల వద్ద చెన్ని మిషన్ పెట్టాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. రైతులు వారి ఇష్టం మేరకు చెన్ని పట్టి ఇస్తారని.. చెన్ని పట్టి ఇచ్చిన వారికి ఎట్టి పరిస్థితిలోనూ తరుగు తీయొద్దన్నారు. హమాలీలు, రవాణా సౌకర్యం ఆలస్యం కాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లకు పంపాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అగ్రికల్చర్ అధికారులు, డీసీఓ సింహాచలం, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: అదుపుతప్పి బావిలో పడిన జీపు.. వాహనంలో 15 మంది

బొర్గం, ధర్మారం(బి) గ్రామాల్లో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా బొర్గం గ్రామంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి.. అక్కడ ఏర్పాటు చేసిన వసతులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వాటర్, షెడ్, తాడిపత్రి, వెయింగ్ మిషన్, రిజిస్టర్​ను పరిశీలించారు.

నాణ్యతా ప్రమాణాలు పాటించాలి:

ధాన్యం 445 కొనుగోలు కేంద్రాల ద్వారా సేకరించి, జిల్లాలోని 247 రైస్ మిల్లర్లకు కేటాయిస్తుందన్నారు. భారత ఆహార సంస్థ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ.. తేమ 17 శాతంలోపు, తాలు ఒక శాతంలోపు ఉండాలని సూచించారు. అట్టి సన్న రకం ధాన్యాన్ని ఏ గ్రేడ్​గా పరిగణించి క్వింటాలుకు రూ.1,888, సాధారణ రకం ఐతే 1,868 రూపాయలు రైతులకు ప్రభుత్వం ఇవ్వాలని నిర్ణయించిందని చెప్పారు. జిల్లాలోని రైతు సోదరులందరూ నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ, రైతు మిల్లర్లకు తరుగు తీసుకునే అవకాశం ఇవ్వకూడదని సూచించారు. తరుగు, కడ్త పేరిట రైతులను ఇబ్బందులకు గురి చేసే రైస్ మిల్లర్లను సీజ్ చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఎట్టి పరిస్థితిలోనూ తరుగు తీయొద్దు:

కొనుగోలు కేంద్రాల వద్ద చెన్ని మిషన్ పెట్టాలని కలెక్టర్ నారాయణ రెడ్డి సూచించారు. రైతులు వారి ఇష్టం మేరకు చెన్ని పట్టి ఇస్తారని.. చెన్ని పట్టి ఇచ్చిన వారికి ఎట్టి పరిస్థితిలోనూ తరుగు తీయొద్దన్నారు. హమాలీలు, రవాణా సౌకర్యం ఆలస్యం కాకుండా తగిన ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే రైస్ మిల్లర్లకు పంపాలని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అగ్రికల్చర్ అధికారులు, డీసీఓ సింహాచలం, సివిల్ సప్లై అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చూడండి: అదుపుతప్పి బావిలో పడిన జీపు.. వాహనంలో 15 మంది

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.