ETV Bharat / city

కన్నుల పండువగా రాములోరి పట్టాభిషేకం - కన్నుల పండువగా రాములోరి పట్టాభిషేకం

వేద పండితుల మంత్రోచ్ఛరణల నడుమ భద్రాచలంలో రాములవారి పట్టాభిషేకం ఘనంగా జరిగింది. భక్తజనం లేకపోయినా... అంగరంగ వైభవంగా పట్టాభిషేక కార్యక్రమాలు నిర్వహించారు.

Lord Srirama PattabhiShekam Completed In badrachalam
కన్నుల పండువగా రాములోరి పట్టాభిషేకం
author img

By

Published : Apr 3, 2020, 5:05 PM IST

ఖడ్గాన్ని చేతబట్టి... కిరీటాన్ని ధరించి శ్రీరాముడు రాజ్యాధికారం చేపట్టాడు. ప్రభుత్వం సమర్పించిన పట్టువస్త్రాల్లో రాములవారు రారాజుగా మెరిసిపోయారు. భక్తులకు ప్రవేశ అనుమతి లేనందున ఎదుర్కోలు, కల్యాణ మహోత్సవాలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. భద్రాచలం ఉత్సవాల్లో చివరి, ప్రధాన ఘట్టమైన శ్రీరాముల పట్టాభిషేక వేడుక వైభవంగా సాగింది. సీతాదేవితో కలిసి శ్రీరాముడు మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. వైదిక పెద్దలు, కొంతమంది ప్రభుత్వ ప్రముఖుల సమక్షంలో పట్టాభిషేక మహోత్సవం పూర్తయింది.

కన్నుల పండువగా రాములోరి పట్టాభిషేకం

స్వామి వారికి ప్రభుత్వ సలహాదారు రమణాచారి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకులు పట్టాభిషేక క్రతువు విశిష్టతను వివరించారు. మహాపట్టాభిషేక మహోత్సవం తర్వాత ఆనవాయితీగా నిర్వహించే తిరువీధి సేవ కూడా లాక్​డౌన్ ఆంక్షల కారణంగా రద్దు చేశారు.

ఇదీ చూడండి : ఖమ్మం మిర్చి గిడ్డంగుల ముందు రైతుల నిరీక్షణ

ఖడ్గాన్ని చేతబట్టి... కిరీటాన్ని ధరించి శ్రీరాముడు రాజ్యాధికారం చేపట్టాడు. ప్రభుత్వం సమర్పించిన పట్టువస్త్రాల్లో రాములవారు రారాజుగా మెరిసిపోయారు. భక్తులకు ప్రవేశ అనుమతి లేనందున ఎదుర్కోలు, కల్యాణ మహోత్సవాలను టీవీల్లో ప్రత్యక్ష ప్రసారాల ద్వారా వీక్షించారు. భద్రాచలం ఉత్సవాల్లో చివరి, ప్రధాన ఘట్టమైన శ్రీరాముల పట్టాభిషేక వేడుక వైభవంగా సాగింది. సీతాదేవితో కలిసి శ్రీరాముడు మహారాజుగా పట్టాభిషిక్తుడయ్యాడు. వైదిక పెద్దలు, కొంతమంది ప్రభుత్వ ప్రముఖుల సమక్షంలో పట్టాభిషేక మహోత్సవం పూర్తయింది.

కన్నుల పండువగా రాములోరి పట్టాభిషేకం

స్వామి వారికి ప్రభుత్వ సలహాదారు రమణాచారి పట్టువస్త్రాలు సమర్పించారు. దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్చకులు పట్టాభిషేక క్రతువు విశిష్టతను వివరించారు. మహాపట్టాభిషేక మహోత్సవం తర్వాత ఆనవాయితీగా నిర్వహించే తిరువీధి సేవ కూడా లాక్​డౌన్ ఆంక్షల కారణంగా రద్దు చేశారు.

ఇదీ చూడండి : ఖమ్మం మిర్చి గిడ్డంగుల ముందు రైతుల నిరీక్షణ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.