ఆర్టీసీ అంటేనే సురక్షిత ప్రయాణానికి నిదర్శనంగా భావిస్తారని పాలనాధికారి శశాంక అన్నారు. కరీంనగర్ రెండో డిపోలో 36 మంది ఉత్తమ ప్రమాద రహిత డ్రైవర్లను కలెక్టర్ సన్మానించారు.
వారికి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాలు అందజేశారు. 32వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించారు. ఆర్టీసీపై ప్రజలకు మరింత నమ్మకం పెరగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.
ఇదీ చూడండి: 'ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్'గా హైదరాబాద్