ఆర్టీసీ బస్సు డ్రైవరు నిర్లక్ష్యం ఒకరి ప్రాణం తీసింది. కరీంనగర్ జిల్లా బొమ్మకల్ వద్ద గోదావరిఖని డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఒకరు మృతి చెందగా మరొకరు తృటిలో తప్పించుకున్నారు. స్థానిక సుల్తాన్బజార్లో వెల్డింగ్ పనులు చేసుకుని వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. మహ్మద్ సాజిద్ అక్కడికక్కడే మరణించగా మహ్మద్ షేక్ను కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు స్థానికులు తెలిపారు.
ఇదీ చదవండిః ఇంట్లో అగ్నిప్రమాదం జరిగితే ఇవీ జాగ్రత్తలు