VIRASAM Maha Sabhalu: ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లాలో.. తెలుగు రాష్ట్రాల విప్లవ రచయితల సంఘం మహాసభలు ప్రారంభమయ్యాయి. రెండు రోజులపాటు నిర్వహించే ఈ 28 వ విరసం మహా సభలకు వివిధ రాష్ట్రాల నుంచి రచయితలు తరలివచ్చారు. తొలుత నెల్లూరు నగరంలోని ఓ పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో కోవూరులోని సుందరయ్య భవన్లో మహా సభలు ప్రారంభించారు.
విరసం ఏర్పడి 52 ఏళ్లు పూర్తయిందని నిర్వాహకులు తెలిపారు. ఈ సభలో 20 పుస్తకాలను ఆవిష్కరిస్తామని వివరించారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను తప్పుబట్టిన పలువురు వక్తలు.. మోదీ ఆధిపత్య నిర్ణయాలను ఖండించారు. మరోవైపు సభ వద్ద ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్తో పాటు స్థానిక పోలీసులు పెద్ద సంఖ్యలో నిఘా ఉంచారు.
ఇదీ చదవండి: Ministers on Shivraj singh: 'వంద ఎలుకలు తిన్న పిల్లి శాకాహారిని అన్నట్లు ఉంది'