హైదరాబాద్ పనిపురాలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో డయాగ్నస్టిక్స్ కేంద్రాన్ని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు. ఇప్పటికే బస్తీ దవాఖానాల వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని.. ఈ కేంద్రాలనూ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు.
అల్ట్రాసౌండ్ స్కానింగ్, ఈసీజీ, ఎక్స్రే సహా సుమారు 52 రక్తపరీక్షలను ఇక్కడ ఉచితంగా నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎంఈ రమేశ్రెడ్డి, ఆస్పత్రి వైద్యులు డాక్టర్ నందిత, డాక్టర్ సూర్య శ్రీ, ల్యాబ్ మేనేజర్ రాజా సురేష్ పాల్గొన్నారు.