ETV Bharat / city

మోదీ ప్రజావ్యతిరేక విధానాలపై దేశవ్యాప్తంగా పోరాడుతాం : కేసీఆర్​

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా తెరాస దేశవ్యాప్త యుద్ధం చేయనున్నట్లు ఆ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. డిసెంబరు రెండో వారంలో హైదరాబాద్​లో దేశంలోని వివిధ రాజకీయ పక్షాలతో కలిసి జాతీయ స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైల్వే స్టేషన్​లో ఛాయి అమ్మానని చెప్పిన మోదీ ఇప్పుడు రైల్వే స్టేషన్లనే అమ్ముతున్నారని ఘాటుగా విమర్శించారు. ఎన్నికల వేళ భావోద్వేగాలు రెచ్చగొట్టి.. మత కల్లోలాలు సృష్టి లబ్ధిపొందడం తప్ప.. మోదీ సర్కారు దేశం కోసం, ప్రజల కోసం చేసింది ఒక్కటీ లేదని కేసీఆర్ మండిపడ్డారు.

author img

By

Published : Nov 18, 2020, 8:27 PM IST

kcr
kcr

కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్త పోరుకు తెరాస సిద్ధమవుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. డిసెంబర్ రెండో వారంలో హైదరాబాద్​లో దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో దేశానికి చేసిందేమీ లేకపోగా.. తప్పుడు ప్రచారాలు, తప్పుడు విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నిష్క్రియా రాజకీయాల వల్ల మోదీ ప్రభుత్వం, భాజపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇతర పక్షాలపై పడిందని సీఎం పేర్కొన్నారు.

ఉద్యోగులకు సంఘీభావంగా

ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించి తద్వారా వాటిని కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెడుతోందని కేసీఆర్ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సంఘీభావంగా, పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యుద్ధం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ భవన్​లో జరిగిన తెరాస లోక్​సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి, జీహెచ్ఎంసీ డివిజన్ ఇంఛార్జీల సంయుక్త సమావేశంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

అన్నింటిని మూసివేస్తున్నారు

నెహ్రూ ప్రజల మేలు కోసం ఎంతో దూర దృష్టితో ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పితే.. మోదీ సర్కారు వాటిని నిర్వీర్యం చేస్తోంది. వాజ్​పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ ముసుగులో ప్రభుత్వరంగ సంస్థలను ఖతం పట్టించే పని ప్రారంభించారు. పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే పెట్టారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా మూడు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకుని భాజపా విధానాలను కొనసాగించింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఏకంగా 23 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించి.. వాటిని ప్రైవేటు, కార్పొరేటు కంపెనీలకు అప్పగిస్తోంది. మోదీ ప్రభుత్వం కొత్తగా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ప్రారంభించక పోగా ఉన్న వాటిని మూసి వేసే ప్రయత్నం చేస్తోంది. దాని వల్ల అటు దేశానికి, ఇటు ప్రజలకు, మరోవైపు అందులో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది.

-ముఖ్యమంత్రి కేసీఆర్

వాటిని ప్రైవేట్​ పరం చేయాల్సిన అవసరం ఏముంది

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసి.. ప్రైవేటు పరం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు కానీ.. లాభాల్లో నడుస్తూ ప్రజలకు సేవలు, ప్రభుత్వాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని కేసీఆర్​ అన్నారు. సుమారు 65 వేల కిలోమీటర్ల నెట్​వర్కుతో.. కోట్లాది మందికి సేవలు అందిస్తున్న.. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద భారతీయ రైల్వే వ్యవస్థను ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి పెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీని ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఎల్ఐసీ లాభాలు గడిస్తే అది దేశానికి ఉపయోగపడుతుందని.. కానీ విదేశీ కంపెనీలు లాభాలు గడిస్తే దేశానికి ఏం లాభమో తెలియదని విమర్శించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటాం

నవరత్నాలుగా చెప్పుకొనే ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్, రక్షణ, బీపీసీఎల్ వంటి సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకుని వాటిని కార్పొరేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం అప్పగిస్తోందన్నారు. ఈ ఏడాది బడ్జెట్​లో లక్ష కోట్ల రూపాయలను ఉపసంహరించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో.. లక్షలాది మంది ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రైవేటుపరం కాకుండా చూడాలని వేడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు తెరాస అండగా ఉంటుందన్నారు. దేశంలోని ఇతర రాజకీయ పక్షాలను కలుపుకుని మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టి.. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే దిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్, పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం బాదల్, కర్ణాటక జేడీయూ నేత కుమారస్వామి, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితర పది మంది నేతలతో మాట్లాడినట్లు కేసీఆర్ వివరించారు.

భిన్నమైన ట్రెండ్ నడుస్తోంది

దేశ రాజకీయాల్లో భిన్నమైన ట్రెండ్ నడుస్తోంది. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం భాజపా చేస్తోంది. ఓ వైపు ప్రజల కోసం ఏదీ చేయకుండానే అన్నీ చేసినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తూ.. మరోవైపు ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపుతోంది. సోషల్ మీడియాను యాంటీ సోషల్ మీడియాగా మార్చి అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అభూత కల్పనలతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్న భాజపా విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ ప్రజలను చైతన్య పరిచి తెరాస పోరాటం చేస్తుంది. మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలు, రైతులు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, కార్మికుల కోసం ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలేదు.

-ముఖ్యమంత్రి కేసీఆర్​

అందమైన నినాదాలతో ఊదరగొడుతున్నారు

ఎన్నికలప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి పాకిస్థాన్, కశ్మీర్, పుల్వామా అంటూ ప్రచారానికి దిగుతూ.. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడతారని సీఎం మండిపడ్డారు. ప్రజలను మత పరంగా విభజించి... మత కల్లోలాలను రేపి ఎన్నికల్లో లబ్ధి పొందుతారు తప్ప.. దేశం కోసం, ప్రజల కోసం ఏ ఒక్క పని చేయలేదని భాజపాపై కేసీఆర్ ధ్వజమెత్తారు. సరిహద్దుల్లో ఏదో యుద్ధం చేసినట్లు ప్రచారం చేసుకుంటారు కానీ... చైనాకు వ్యతిరేకంగా కొట్లాడలేక చతికిల పడతారని విమర్శించారు. బేటీ బచావో, బేటీ పడావో లాంటి అందమైన నినాదాలతో ఊదరగొట్టడం తప్ప వాస్తవానికి ఏ పని చేయరని కేసీఆర్ అన్నారు. భాజపా ప్రచారం గులక రాళ్ల డబ్బాను ఊపినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి : 'సాయం'... నిన్న ఇవ్వమన్నారు.. ఇవాళ వద్దన్నారు!

కేంద్ర ప్రభుత్వ ప్రజా, రైతు, కార్మిక వ్యతిరేక విధానాలపై దేశ వ్యాప్త పోరుకు తెరాస సిద్ధమవుతోందని ముఖ్యమంత్రి కేసీఆర్​ వెల్లడించారు. డిసెంబర్ రెండో వారంలో హైదరాబాద్​లో దేశంలోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలకు చెందిన నాయకులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. మోదీ ప్రభుత్వం ఆరున్నరేళ్లలో దేశానికి చేసిందేమీ లేకపోగా.. తప్పుడు ప్రచారాలు, తప్పుడు విధానాలతో దేశాన్ని తిరోగమనం వైపు నెట్టిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ నిష్క్రియా రాజకీయాల వల్ల మోదీ ప్రభుత్వం, భాజపా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను తిప్పికొట్టాల్సిన బాధ్యత ఇతర పక్షాలపై పడిందని సీఎం పేర్కొన్నారు.

ఉద్యోగులకు సంఘీభావంగా

ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించి తద్వారా వాటిని కార్పొరేట్ కంపెనీల చేతుల్లో పెడుతోందని కేసీఆర్ దుయ్యబట్టారు. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులకు సంఘీభావంగా, పెట్టుబడుల ఉపసంహరణకు వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా యుద్ధం చేస్తామని ప్రకటించారు. తెలంగాణ భవన్​లో జరిగిన తెరాస లోక్​సభ, రాజ్యసభ, శాసనసభ, శాసనమండలి, జీహెచ్ఎంసీ డివిజన్ ఇంఛార్జీల సంయుక్త సమావేశంలో కేసీఆర్ జాతీయ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు.

అన్నింటిని మూసివేస్తున్నారు

నెహ్రూ ప్రజల మేలు కోసం ఎంతో దూర దృష్టితో ప్రభుత్వ రంగ సంస్థలను నెలకొల్పితే.. మోదీ సర్కారు వాటిని నిర్వీర్యం చేస్తోంది. వాజ్​పేయీ ప్రధానిగా ఉన్నప్పుడు పెట్టుబడుల ఉపసంహరణ ముసుగులో ప్రభుత్వరంగ సంస్థలను ఖతం పట్టించే పని ప్రారంభించారు. పెట్టుబడుల ఉపసంహరణ కోసం ఏకంగా ఓ మంత్రిత్వ శాఖనే పెట్టారు. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కూడా మూడు ప్రభుత్వరంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకుని భాజపా విధానాలను కొనసాగించింది. ఇప్పుడు మోదీ ప్రభుత్వం ఏకంగా 23 ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను ఉపసంహరించి.. వాటిని ప్రైవేటు, కార్పొరేటు కంపెనీలకు అప్పగిస్తోంది. మోదీ ప్రభుత్వం కొత్తగా ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ రంగ సంస్థను ప్రారంభించక పోగా ఉన్న వాటిని మూసి వేసే ప్రయత్నం చేస్తోంది. దాని వల్ల అటు దేశానికి, ఇటు ప్రజలకు, మరోవైపు అందులో పని చేస్తున్న లక్షలాది మంది ఉద్యోగులకు తీరని అన్యాయం జరుగుతుంది.

-ముఖ్యమంత్రి కేసీఆర్

వాటిని ప్రైవేట్​ పరం చేయాల్సిన అవసరం ఏముంది

నష్టాల్లో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసి.. ప్రైవేటు పరం చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు కానీ.. లాభాల్లో నడుస్తూ ప్రజలకు సేవలు, ప్రభుత్వాలకు నిధులు అందిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను మూసి వేస్తున్నారంటే ఎలా అర్థం చేసుకోవాలని కేసీఆర్​ అన్నారు. సుమారు 65 వేల కిలోమీటర్ల నెట్​వర్కుతో.. కోట్లాది మందికి సేవలు అందిస్తున్న.. ప్రపంచంలోనే నాలుగో అతి పెద్ద భారతీయ రైల్వే వ్యవస్థను ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరమేంటని ప్రశ్నించారు. ప్రపంచంలోనే అతి పెద్ద బీమా కంపెనీ ఎల్ఐసీని ప్రైవేటు పరం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందన్నారు. ఎల్ఐసీ లాభాలు గడిస్తే అది దేశానికి ఉపయోగపడుతుందని.. కానీ విదేశీ కంపెనీలు లాభాలు గడిస్తే దేశానికి ఏం లాభమో తెలియదని విమర్శించారు.

ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటాం

నవరత్నాలుగా చెప్పుకొనే ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్, బీఎస్ఎన్ఎల్, రక్షణ, బీపీసీఎల్ వంటి సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించుకుని వాటిని కార్పొరేట్ సంస్థలకు మోదీ ప్రభుత్వం అప్పగిస్తోందన్నారు. ఈ ఏడాది బడ్జెట్​లో లక్ష కోట్ల రూపాయలను ఉపసంహరించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వం నిర్ణయంతో.. లక్షలాది మంది ఉద్యోగులు ఆందోళనలో ఉన్నారన్నారు. ప్రైవేటుపరం కాకుండా చూడాలని వేడుకుంటున్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలకు తెరాస అండగా ఉంటుందన్నారు. దేశంలోని ఇతర రాజకీయ పక్షాలను కలుపుకుని మోదీ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టి.. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుంటామని కేటీఆర్ ప్రకటించారు. ఇప్పటికే దిల్లీ సీఎం కేజ్రీవాల్, కేరళ సీఎం విజయన్, పశ్చిమ బంగ సీఎం మమతా బెనర్జీ, పంజాబ్ సీఎం బాదల్, కర్ణాటక జేడీయూ నేత కుమారస్వామి, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తదితర పది మంది నేతలతో మాట్లాడినట్లు కేసీఆర్ వివరించారు.

భిన్నమైన ట్రెండ్ నడుస్తోంది

దేశ రాజకీయాల్లో భిన్నమైన ట్రెండ్ నడుస్తోంది. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజమని నమ్మించే ప్రయత్నం భాజపా చేస్తోంది. ఓ వైపు ప్రజల కోసం ఏదీ చేయకుండానే అన్నీ చేసినట్లు అబద్ధాలు ప్రచారం చేస్తూ.. మరోవైపు ప్రజల కోసం పనిచేస్తున్న వారిపై నిందలు మోపుతోంది. సోషల్ మీడియాను యాంటీ సోషల్ మీడియాగా మార్చి అబద్ధాలను విస్తృతంగా ప్రచారం చేస్తోంది. అభూత కల్పనలతో ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్న భాజపా విధానాలకు వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం వచ్చింది. మోదీ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై దేశ ప్రజలను చైతన్య పరిచి తెరాస పోరాటం చేస్తుంది. మోదీ ప్రభుత్వం ఇప్పటి వరకు ప్రజలు, రైతులు, దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, కార్మికుల కోసం ఒక్కటంటే ఒక్క పని కూడా చేయలేదు.

-ముఖ్యమంత్రి కేసీఆర్​

అందమైన నినాదాలతో ఊదరగొడుతున్నారు

ఎన్నికలప్పుడు రాజకీయ లబ్ధి పొందడానికి పాకిస్థాన్, కశ్మీర్, పుల్వామా అంటూ ప్రచారానికి దిగుతూ.. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడతారని సీఎం మండిపడ్డారు. ప్రజలను మత పరంగా విభజించి... మత కల్లోలాలను రేపి ఎన్నికల్లో లబ్ధి పొందుతారు తప్ప.. దేశం కోసం, ప్రజల కోసం ఏ ఒక్క పని చేయలేదని భాజపాపై కేసీఆర్ ధ్వజమెత్తారు. సరిహద్దుల్లో ఏదో యుద్ధం చేసినట్లు ప్రచారం చేసుకుంటారు కానీ... చైనాకు వ్యతిరేకంగా కొట్లాడలేక చతికిల పడతారని విమర్శించారు. బేటీ బచావో, బేటీ పడావో లాంటి అందమైన నినాదాలతో ఊదరగొట్టడం తప్ప వాస్తవానికి ఏ పని చేయరని కేసీఆర్ అన్నారు. భాజపా ప్రచారం గులక రాళ్ల డబ్బాను ఊపినట్లు ఉంటుందని ఎద్దేవా చేశారు.

ఇదీ చదవండి : 'సాయం'... నిన్న ఇవ్వమన్నారు.. ఇవాళ వద్దన్నారు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.