ETV Bharat / city

మెట్రో రైలు పట్టాలపై కూర్చొని తెరాస నాయకుల నిరసన

దిల్లీలో రైతుల పోరాటానికి మద్దతుగా రాష్ట్రవ్యాప్తంగా భారత్​ బంద్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్​ కూకట్​పల్లి, కేపీహెచ్​బీ మెట్రో స్టేషన్​లో రైలు పట్టాలపై కూర్చొని తెరాస నాయకులు నిరసన వ్యక్తం చేశారు.

author img

By

Published : Dec 8, 2020, 12:55 PM IST

kphb in support of farmers protest
మెట్రో రైలు పట్టాలపై కూర్చొని తెరాస నాయకుల నిరసన

దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. భాజపాయేతర పార్టీల నేతలు హైదరాబాద్​ కూకట్​పల్లి, కేపీహెచ్​బీ మెట్రో స్టేషన్​లో రైలు పట్టాలపై కూర్చొని రైళ్లను నిలిపివేశారు. భారత్​ బంద్​లో భాగంగా మెట్రో రైళ్లు నిలిపివేసి రైతులకు అండగా నిలవాలని కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్టేషన్​కు వచ్చి తెరాస నేతలను అక్కణ్నుంచి పంపించారు.

రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే వరకు ఈ పోరాటం ఆగదని, రైతులకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని తెరాస నాయకులు స్పష్టం చేశారు.

దిల్లీలో రైతులు చేస్తున్న ఉద్యమానికి దేశవ్యాప్తంగా మద్దతు లభిస్తోంది. భాజపాయేతర పార్టీల నేతలు హైదరాబాద్​ కూకట్​పల్లి, కేపీహెచ్​బీ మెట్రో స్టేషన్​లో రైలు పట్టాలపై కూర్చొని రైళ్లను నిలిపివేశారు. భారత్​ బంద్​లో భాగంగా మెట్రో రైళ్లు నిలిపివేసి రైతులకు అండగా నిలవాలని కోరారు. విషయం తెలుసుకున్న పోలీసులు స్టేషన్​కు వచ్చి తెరాస నేతలను అక్కణ్నుంచి పంపించారు.

రైతులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ చట్టాలను ఉపసంహరించే వరకు ఈ పోరాటం ఆగదని, రైతులకు ఎల్లప్పుడూ తాము అండగా ఉంటామని తెరాస నాయకులు స్పష్టం చేశారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.