ETV Bharat / city

TIRUMALA DARSHAN: వెంకన్నను దర్శించుకున్న సినీ, క్రీడా ప్రముఖులు

author img

By

Published : Sep 25, 2021, 6:37 PM IST

తిరుమల శ్రీవారిని ఈరోజు ఉదయం బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, సినీనటి రమాప్రభ, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు.

TIRUMALA DARSHAN
తిరుమలలో ప్రముఖులు

తిరుపతి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, అలనాటి సినీ నటి రమాప్రభ, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

దర్శనానంతరం అర్చకులు వారికి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరోనా పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు భక్తుల రాక పెరిగింది. ఇదే క్రమంలో తితిదే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఆన్​లైన్​లో స్వామివారి దర్శన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది.

తిరుపతి తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈరోజు ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్, అలనాటి సినీ నటి రమాప్రభ, చిత్తూరు ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు స్వామివారి సేవలో పాల్గొన్నారు.

దర్శనానంతరం అర్చకులు వారికి రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. కరోనా పరిస్థితులు కాస్త తగ్గుముఖం పట్టడంతో తిరుమలకు భక్తుల రాక పెరిగింది. ఇదే క్రమంలో తితిదే భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేసింది. ఆన్​లైన్​లో స్వామివారి దర్శన టికెట్లను అందుబాటులోకి తెచ్చింది.

తిరుమలలో ప్రముఖులు

ఇదీ చూడండి: Tirumala Tickets : ఆన్​లైన్​లో శ్రీవారి సర్వదర్శనం టికెట్లు.. అరగంటలోనే ఖాళీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.