ETV Bharat / city

Niharika: నిహారిక భర్త న్యూసెన్స్‌ కేసు.. ఏమైందంటే..!

author img

By

Published : Aug 5, 2021, 7:00 PM IST

నాగబాబు కుమార్తె నిహారిక నివసించే అపార్ట్​మెంట్​లో వివాదం జరిగినట్లు తెలుస్తోంది. అర్ధరాత్రి సమయంలో నిహారిక ఫ్లాట్​ వద్ద గొడవ జరిగింది. బంజారాహిల్స్​ పోలీస్​ స్టేషన్​లో ఆమె భర్తపై అపార్ట్​మెంట్ వాసులు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. నిహారిక భర్త చైతన్య కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే తాజాగా ఇరువర్గాల మధ్య రాజీ కుదరడం వల్ల, తమ ఫిర్యాదులను వెనక్కి తీసుకున్నారు.

niharika husband chaitanya
niharika husband chaitanya

మెగా డాటర్ నిహారిక భర్త చైతన్యపై న్యూసెన్స్ కేసులో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్​మెంట్​లో ఫ్లాట్‌ను చైతన్య కొంతకాలం క్రితం అద్దెకు తీసుకున్నారు. అయితే అపార్టుమెంట్‌లో ఆఫీస్ పెట్టటానికి వీల్లేదని అపార్టుమెంట్ వాసులు చైతన్యతో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే చైతన్య, అపార్టుమెంట్ వాసుల మధ్య వాగ్వాదం జరిగింది. తమ ఆఫీస్‌లోకి అక్రమంగా ప్రవేశించి గొడవకు దిగారని చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తమ అపార్ట్‌మెంట్‌‌లో న్యూసెన్స్ చేస్తున్నారని అపార్టుమెంట్ వాసులు ఫిర్యాదు చేశారు.

గత కొన్ని రోజులుగా నిహారిక భర్త చైతన్య ఉండే ఫ్లాట్‌కు కొంతమంది యువకులు వస్తున్నారని.. వచ్చిన ప్రతిసారీ మద్యం సేవించి నానా హంగామా సృష్టిస్తున్నారని అపార్టుమెంట్‌ వాసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం నాడు జరిగిన వాగ్వాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. ఇరువురినీ స్టేషన్‌కు పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ చేశారు. అనంతరం ఇరువర్గాలు రాజీకి వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.

మెగా డాటర్ నిహారిక భర్త చైతన్యపై న్యూసెన్స్ కేసులో ఇరు వర్గాలు రాజీ కుదుర్చుకున్నాయి. బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ అపార్ట్​మెంట్​లో ఫ్లాట్‌ను చైతన్య కొంతకాలం క్రితం అద్దెకు తీసుకున్నారు. అయితే అపార్టుమెంట్‌లో ఆఫీస్ పెట్టటానికి వీల్లేదని అపార్టుమెంట్ వాసులు చైతన్యతో గొడవకు దిగారు. ఈ క్రమంలోనే చైతన్య, అపార్టుమెంట్ వాసుల మధ్య వాగ్వాదం జరిగింది. తమ ఆఫీస్‌లోకి అక్రమంగా ప్రవేశించి గొడవకు దిగారని చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత తమ అపార్ట్‌మెంట్‌‌లో న్యూసెన్స్ చేస్తున్నారని అపార్టుమెంట్ వాసులు ఫిర్యాదు చేశారు.

గత కొన్ని రోజులుగా నిహారిక భర్త చైతన్య ఉండే ఫ్లాట్‌కు కొంతమంది యువకులు వస్తున్నారని.. వచ్చిన ప్రతిసారీ మద్యం సేవించి నానా హంగామా సృష్టిస్తున్నారని అపార్టుమెంట్‌ వాసులు ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళవారం నాడు జరిగిన వాగ్వాదానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు సేకరించారు. ఇరువురినీ స్టేషన్‌కు పిలిపించి పోలీసులు కౌన్సెలింగ్ చేశారు. అనంతరం ఇరువర్గాలు రాజీకి వచ్చినట్టు పోలీసులు వెల్లడించారు.

ఇదీ చూడండి: Olympics: భారత్​కు మరో పతకం.. రెజ్లర్​ రవి దహియాకు రజతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.