ETV Bharat / city

అస్తవ్యస్తంగా మారిన విద్యావ్యవస్థ.. 'ప్రైవేటు' బాటలో విద్యార్థులు..

author img

By

Published : Oct 10, 2022, 4:55 PM IST

విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టాం.. మూడేళ్లలో రూ.52వేల కోట్లు ఖర్చుచేశాం.. ఇవీ తరచూ ఏపీ సీఎం జగన్, మంత్రులు చెప్పే మాటలు.. ఏలిన వారి ప్రకటనలు ఇలా ఉంటే.. క్షేత్రస్థాయిలో మాత్రం విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. తమ పథకాలతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థులు పెరిగారని ఇన్నాళ్లూ బాకా ఊదారు. ఇప్పుడు ఈ ఒక్క ఏడాదే మూడున్నర లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు బడులకు వెళ్లిపోయారు. కరోనా సమయంలో దేశవ్యాప్తంగా ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు పెరిగితే.. అది తమ ఘనతేనని ప్రచారం చేసుకున్న మంత్రులు.. ఇప్పుడు తగ్గుదల గురించి అస్సలు నోరు మెదపడం లేదు. పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల ఫీజులు నియంత్రిస్తామని చెప్పి మూడేళ్లు పూర్తయినా ఎక్కడా ఫీజులు తగ్గకపోగా.. గతం కంటే పెరిగాయి. ఏపీలో అస్తవ్యస్తంగా మారిన విద్యా వ్యవస్థపై ప్రత్యేక కథనం.

education
education

వైకాపా ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ తరచూ చెబుతుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరగడం ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం అంటుంటారు. ఆంగ్ల మాధ్యమం, అమ్మఒడి, గోరుముద్ద, నాడు-నేడు లాంటి కార్యక్రమాల వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెబుతుంటారు. ఆయన మాటలు ఇలా ఉంటే వాస్తవం మరోలా ఉంది. కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక చాలామంది పేద, దిగువ మధ్యతరగతి వారు తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించారు.

అసర్‌-2021 సర్వే సైతం దీన్ని వెల్లడించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి కనిపించింది. కానీ విద్యార్థుల పెరుగుదలను తమ ఘనతగా ఏపీ సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రచారం చేశారు. నిజంగా అలాగే పెరిగితే... 2022-23లో 3.50లక్షల మంది ఎందుకు తగ్గారు? అంటే.. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం తగ్గిందా? అడ్డగోలు విలీనం బెడిసికొట్టిందా? విద్యార్థుల సంఖ్య తగ్గితే వివరాలను అందిస్తామని, ఎందుకు తగ్గారో విశ్లేషణ సైతం ఇస్తామని చెప్పిన మంత్రి దీనిపై మాట్లాడటమే మానేశారు. ప్రభుత్వం అసెంబ్లీలోనూ గతేడాది విద్యార్థుల సంఖ్యనే ఇచ్చింది. విద్యార్థులు పెరిగితే ఘనత అని చెప్పినవారు తగ్గితే ఎందుకు దాస్తున్నారో అర్థం కాని పరిస్థితి.

గత ప్రభుత్వంలో కార్పొరేట్‌ విద్యాసంస్థల అధిపతులే మంత్రులుగా ఉండటంతో ఫీజులు నియంత్రించలేని పరిస్థితి ఉండేదని గతంలో సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. ఇష్టానుసారం ఫీజులు పెంచుకునే అవకాశం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని గతంలో సీఎం జగన్ అన్నారు. కానీ అసలు వాస్తవం మరోలా ఉంది. విద్యాసంస్థలు ఉన్నవారినే సీఎం జగన్.. విద్యాశాఖ మంత్రులుగా నియమించారు. మొన్నటివరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్‌ కుటుంబసభ్యులకు కర్నూలు, ఒంగోలులో శామ్యూల్‌ జార్జి పేరుతో డిగ్రీ, బీఈడీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి.

ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణకు విజయనగరంలో సత్య, సీతం పేరుతో ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ ట్రస్టులో ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. పాఠశాలలకు ఫీజులు నిర్ణయించే పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ కార్యదర్శిగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, ఇంజినీరింగ్‌ కళాశాల యజమాని సాంబశివారెడ్డిని నియమించారు. ఆయన ఉన్నత విద్యా కమిషన్‌లో సభ్యుడు కూడా. పాఠశాల కమిషన్‌ వైస్‌ఛైర్మన్‌ శారదారెడ్డికి ఉమ్మడి గుంటూరులో విద్యాసంస్థలు ఉన్నాయి. కార్యదర్శి, వైస్‌ ఛైర్మన్, సభ్యులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఛైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. పాఠశాల విద్యా కమిషన్‌ను ఏర్పాటుచేసి మూడేళ్లు గడిచినా ఇంతవరకూ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల ఫీజులను నియంత్రించలేదు. సరికదా గతంతో పోలిస్తే ప్రస్తుతం 50శాతానికిపైగా ఫీజులు పెరిగాయి కూడా.

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ఎత్తేసి... పూర్తిగా ఆంగ్ల మీడియం ఏర్పాటు చేయడాన్ని సీఎం జగన్ గట్టిగా సమర్థించుకున్నారు. పిల్లలకు ఆంగ్లబోధన కోసం బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేస్తామని... ప్రతి బడిలో ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. మన పిల్లలు ప్రపంచ జాబ్‌మార్కెట్‌తో పోటీపడేలా చేయడానికి అడుగులు వేయాలా.. వద్దా అని ప్రశ్నించారు. ఆ మాటలు వినడానికి బాగానే ఉన్నాయి. కానీ వాస్తవంలో ఏం జరిగింది ఏమిటంటే.. ఉపాధ్యాయుల సామర్థ్యాలు, పిల్లల పరిస్థితులను పట్టించుకోకుండా ఒకేసారి 1 నుంచి 6తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చారు. ఇప్పుడు దీని ఫలితం కనిపిస్తోంది.

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 4 నుంచి 8 తరగతుల విద్యార్థులు ఆంగ్లంలో చిన్న వాక్యాన్ని కూడా చదవలేకపోతున్నారు. వీరంతా 9,10 తరగతులకు వచ్చి సీబీఎస్‌ఈ సిలబస్‌ చదవాల్సి వస్తే పరిస్థితి ఏంటి? పదోతరగతిలో ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాసి, ఎలా ఉత్తీర్ణులవుతారు? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు భాషా సమస్య ఏర్పడుతోందని గతేడాది డిసెంబరులో ఎన్‌సీఈఆర్టీ-2019-20 వార్షిక నివేదిక పేర్కొంది. వాస్తవాలు ఇలా ఉంటే ఆంగ్ల మాధ్యమాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారంటూ ప్రచారం చేస్తూ అసలు సమస్యను ప్రభుత్వం మరుగున పడేస్తోంది.

ఇక పాఠశాలల విలీనం విషయానికి వస్తే... జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించాలని సీఎం జగన్ అన్నారు.. మూడోతరగతి నుంచి సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన ఉంటుందని... తరగతుల విలీనం కారణంగా ఒక్క పాఠశాల మూతడిపడినా బాధ్యత వహిస్తామని దీమాగా సీఎం చెప్పారు. ఆయన మాటలు అలా ఉంటే.. అసలు వాస్తవం మరోలా ఉంది. అసలు జాతీయ నూతన విద్యావిధానం ప్రాథమిక పాఠశాలలను విభజించాలని చెప్పనేలేదు. 5+3+3+4 విధానంలో కరిక్యులమ్‌ ఉండాలని మాత్రమే చెప్పింది.

ప్రపంచ బ్యాంకు నిబంధనకు తలొగ్గిన ప్రభుత్వం నూతన విద్యావిధానం పేరుతో 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గిస్తోంది. ప్రపంచబ్యాంకు 1,838 కోట్లు రుణంగా ఇస్తోంది. అయితే మానవ వనరులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవాలనే నిబంధన విధించింది. దీంతో కొత్తగా ఉపాధ్యాయులను నియమించకుండా ఉన్నవారినే సర్దుబాటు చేసేందుకు ఈ కొత్త విధానం తెచ్చారు. విలీనంతో దాదాపు ఖాళీ అయిన పాఠశాలలు భవిష్యత్తులో కొనసాగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా ఎక్కడా బడి మూయకపోయినా పిల్లలు వెళ్లిపోతే వాటికవే మూతపడతాయి కదా. మరి దీనికి అసలు కారణం ఎవరు?.

విద్యాకానుక కిట్లు, ఏకరూప దుస్తులు, పుస్తకాల విషయంలోనూ సీఎం జగన్‌ ఎన్నో కబుర్లు చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటికే పుస్తకాలు సహా విద్యాకానుక కిట్లు విద్యార్థులకు అందించాలని... ఏకరూప దుస్తులు సహా దేంట్లోనూ నాణ్యత తగ్గకుండా చూడాలని అన్నారు. గత ప్రభుత్వంలో అక్టోబరు, నవంబరు వరకు పుస్తకాలు అందని పరిస్థితిని పాదయాత్రలో గమనించానని చెప్పుకొచ్చారు. మాటలు సరే.. వాస్తవంలో ఏం జరుగుతోందంటే

విద్యాకానుక కిట్లు సెప్టెంబరులోనూ ఇస్తూనే ఉన్నారు. పాఠశాలలను ఈ ఏడాది 20రోజులు ఆలస్యంగా తెరిచినా విద్యాకానుక కిట్లు ఇవ్వడానికి రెండు నెలలకు పైగా తీసుకున్నారు. బ్యాగ్‌లు కొన్నిరోజులకే పాడయ్యాయి. విద్యార్థుల సంఖ్య 3.50 లక్షలకు తగ్గినా అందరికీ కిట్లు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నారు. మరి ప్రైవేటుకు వెళ్లిన వారి కిట్లు ఏమయ్యాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇలా ఏ విషయంలో చూసినా విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన దృశ్యమే కనిపిస్తోంది.

అస్తవ్యస్తంగా విద్యావ్యవస్థ.. 'ప్రైవేటు' బాటలో విద్యార్థులు..

ఇవీ చదవండి:

వైకాపా ప్రభుత్వం విద్యారంగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిందని ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్ తరచూ చెబుతుంటారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరగడం ప్రభుత్వం పట్ల ప్రజలకు ఉన్న విశ్వాసానికి నిదర్శనం అంటుంటారు. ఆంగ్ల మాధ్యమం, అమ్మఒడి, గోరుముద్ద, నాడు-నేడు లాంటి కార్యక్రమాల వల్లే ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని చెబుతుంటారు. ఆయన మాటలు ఇలా ఉంటే వాస్తవం మరోలా ఉంది. కరోనా సమయంలో ప్రైవేటు పాఠశాలల్లో ఫీజులు చెల్లించలేక చాలామంది పేద, దిగువ మధ్యతరగతి వారు తమ పిల్లల్ని ప్రభుత్వ బడుల్లో చేర్పించారు.

అసర్‌-2021 సర్వే సైతం దీన్ని వెల్లడించింది. ఆ సమయంలో దేశవ్యాప్తంగానూ ఇదే పరిస్థితి కనిపించింది. కానీ విద్యార్థుల పెరుగుదలను తమ ఘనతగా ఏపీ సీఎం జగన్, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రచారం చేశారు. నిజంగా అలాగే పెరిగితే... 2022-23లో 3.50లక్షల మంది ఎందుకు తగ్గారు? అంటే.. ప్రభుత్వంపై ప్రజలకు విశ్వాసం తగ్గిందా? అడ్డగోలు విలీనం బెడిసికొట్టిందా? విద్యార్థుల సంఖ్య తగ్గితే వివరాలను అందిస్తామని, ఎందుకు తగ్గారో విశ్లేషణ సైతం ఇస్తామని చెప్పిన మంత్రి దీనిపై మాట్లాడటమే మానేశారు. ప్రభుత్వం అసెంబ్లీలోనూ గతేడాది విద్యార్థుల సంఖ్యనే ఇచ్చింది. విద్యార్థులు పెరిగితే ఘనత అని చెప్పినవారు తగ్గితే ఎందుకు దాస్తున్నారో అర్థం కాని పరిస్థితి.

గత ప్రభుత్వంలో కార్పొరేట్‌ విద్యాసంస్థల అధిపతులే మంత్రులుగా ఉండటంతో ఫీజులు నియంత్రించలేని పరిస్థితి ఉండేదని గతంలో సీఎం జగన్‌ చెప్పుకొచ్చారు. ఇష్టానుసారం ఫీజులు పెంచుకునే అవకాశం ఇచ్చినా ఎవరూ పట్టించుకోలేదని గతంలో సీఎం జగన్ అన్నారు. కానీ అసలు వాస్తవం మరోలా ఉంది. విద్యాసంస్థలు ఉన్నవారినే సీఎం జగన్.. విద్యాశాఖ మంత్రులుగా నియమించారు. మొన్నటివరకు విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్‌ కుటుంబసభ్యులకు కర్నూలు, ఒంగోలులో శామ్యూల్‌ జార్జి పేరుతో డిగ్రీ, బీఈడీ, ఇంజినీరింగ్‌ కళాశాలలు ఉన్నాయి.

ప్రస్తుత మంత్రి బొత్స సత్యనారాయణకు విజయనగరంలో సత్య, సీతం పేరుతో ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలు ఉన్నాయి. ఈ ట్రస్టులో ఆయన కుటుంబసభ్యులు ఉన్నారు. పాఠశాలలకు ఫీజులు నిర్ణయించే పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ కార్యదర్శిగా ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి భర్త, ఇంజినీరింగ్‌ కళాశాల యజమాని సాంబశివారెడ్డిని నియమించారు. ఆయన ఉన్నత విద్యా కమిషన్‌లో సభ్యుడు కూడా. పాఠశాల కమిషన్‌ వైస్‌ఛైర్మన్‌ శారదారెడ్డికి ఉమ్మడి గుంటూరులో విద్యాసంస్థలు ఉన్నాయి. కార్యదర్శి, వైస్‌ ఛైర్మన్, సభ్యులు పట్టించుకోకపోవడంతో మనస్తాపానికి గురైన ఛైర్మన్‌ జస్టిస్‌ కాంతారావు తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు. పాఠశాల విద్యా కమిషన్‌ను ఏర్పాటుచేసి మూడేళ్లు గడిచినా ఇంతవరకూ ప్రైవేటు పాఠశాలలు, జూనియర్‌ కళాశాలల ఫీజులను నియంత్రించలేదు. సరికదా గతంతో పోలిస్తే ప్రస్తుతం 50శాతానికిపైగా ఫీజులు పెరిగాయి కూడా.

ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మీడియం ఎత్తేసి... పూర్తిగా ఆంగ్ల మీడియం ఏర్పాటు చేయడాన్ని సీఎం జగన్ గట్టిగా సమర్థించుకున్నారు. పిల్లలకు ఆంగ్లబోధన కోసం బ్రిడ్జి కోర్సులు ఏర్పాటు చేస్తామని... ప్రతి బడిలో ఇంగ్లీష్‌ ల్యాబ్‌లు తీసుకొస్తామని చెప్పుకొచ్చారు. మన పిల్లలు ప్రపంచ జాబ్‌మార్కెట్‌తో పోటీపడేలా చేయడానికి అడుగులు వేయాలా.. వద్దా అని ప్రశ్నించారు. ఆ మాటలు వినడానికి బాగానే ఉన్నాయి. కానీ వాస్తవంలో ఏం జరిగింది ఏమిటంటే.. ఉపాధ్యాయుల సామర్థ్యాలు, పిల్లల పరిస్థితులను పట్టించుకోకుండా ఒకేసారి 1 నుంచి 6తరగతులను ఆంగ్ల మాధ్యమంలోకి మార్చారు. ఇప్పుడు దీని ఫలితం కనిపిస్తోంది.

ప్రభుత్వ బడుల్లో చదువుతున్న 4 నుంచి 8 తరగతుల విద్యార్థులు ఆంగ్లంలో చిన్న వాక్యాన్ని కూడా చదవలేకపోతున్నారు. వీరంతా 9,10 తరగతులకు వచ్చి సీబీఎస్‌ఈ సిలబస్‌ చదవాల్సి వస్తే పరిస్థితి ఏంటి? పదోతరగతిలో ఆంగ్ల మాధ్యమంలో పరీక్ష రాసి, ఎలా ఉత్తీర్ణులవుతారు? ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులకు భాషా సమస్య ఏర్పడుతోందని గతేడాది డిసెంబరులో ఎన్‌సీఈఆర్టీ-2019-20 వార్షిక నివేదిక పేర్కొంది. వాస్తవాలు ఇలా ఉంటే ఆంగ్ల మాధ్యమాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారంటూ ప్రచారం చేస్తూ అసలు సమస్యను ప్రభుత్వం మరుగున పడేస్తోంది.

ఇక పాఠశాలల విలీనం విషయానికి వస్తే... జాతీయ నూతన విద్యా విధానానికి అనుగుణంగా ప్రాథమిక పాఠశాలల నుంచి 3,4,5 తరగతులను ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు తరలించాలని సీఎం జగన్ అన్నారు.. మూడోతరగతి నుంచి సబ్జెక్టు ఉపాధ్యాయులతో బోధన ఉంటుందని... తరగతుల విలీనం కారణంగా ఒక్క పాఠశాల మూతడిపడినా బాధ్యత వహిస్తామని దీమాగా సీఎం చెప్పారు. ఆయన మాటలు అలా ఉంటే.. అసలు వాస్తవం మరోలా ఉంది. అసలు జాతీయ నూతన విద్యావిధానం ప్రాథమిక పాఠశాలలను విభజించాలని చెప్పనేలేదు. 5+3+3+4 విధానంలో కరిక్యులమ్‌ ఉండాలని మాత్రమే చెప్పింది.

ప్రపంచ బ్యాంకు నిబంధనకు తలొగ్గిన ప్రభుత్వం నూతన విద్యావిధానం పేరుతో 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో విలీనం చేసి, ఉపాధ్యాయుల సంఖ్యను తగ్గిస్తోంది. ప్రపంచబ్యాంకు 1,838 కోట్లు రుణంగా ఇస్తోంది. అయితే మానవ వనరులపై పెట్టే ఖర్చును తగ్గించుకోవాలనే నిబంధన విధించింది. దీంతో కొత్తగా ఉపాధ్యాయులను నియమించకుండా ఉన్నవారినే సర్దుబాటు చేసేందుకు ఈ కొత్త విధానం తెచ్చారు. విలీనంతో దాదాపు ఖాళీ అయిన పాఠశాలలు భవిష్యత్తులో కొనసాగుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం అధికారికంగా ఎక్కడా బడి మూయకపోయినా పిల్లలు వెళ్లిపోతే వాటికవే మూతపడతాయి కదా. మరి దీనికి అసలు కారణం ఎవరు?.

విద్యాకానుక కిట్లు, ఏకరూప దుస్తులు, పుస్తకాల విషయంలోనూ సీఎం జగన్‌ ఎన్నో కబుర్లు చెప్పారు. విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేనాటికే పుస్తకాలు సహా విద్యాకానుక కిట్లు విద్యార్థులకు అందించాలని... ఏకరూప దుస్తులు సహా దేంట్లోనూ నాణ్యత తగ్గకుండా చూడాలని అన్నారు. గత ప్రభుత్వంలో అక్టోబరు, నవంబరు వరకు పుస్తకాలు అందని పరిస్థితిని పాదయాత్రలో గమనించానని చెప్పుకొచ్చారు. మాటలు సరే.. వాస్తవంలో ఏం జరుగుతోందంటే

విద్యాకానుక కిట్లు సెప్టెంబరులోనూ ఇస్తూనే ఉన్నారు. పాఠశాలలను ఈ ఏడాది 20రోజులు ఆలస్యంగా తెరిచినా విద్యాకానుక కిట్లు ఇవ్వడానికి రెండు నెలలకు పైగా తీసుకున్నారు. బ్యాగ్‌లు కొన్నిరోజులకే పాడయ్యాయి. విద్యార్థుల సంఖ్య 3.50 లక్షలకు తగ్గినా అందరికీ కిట్లు ఇచ్చినట్లు లెక్కలు చెబుతున్నారు. మరి ప్రైవేటుకు వెళ్లిన వారి కిట్లు ఏమయ్యాయో ఎవరికీ తెలియని పరిస్థితి. ఇలా ఏ విషయంలో చూసినా విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా మారిన దృశ్యమే కనిపిస్తోంది.

అస్తవ్యస్తంగా విద్యావ్యవస్థ.. 'ప్రైవేటు' బాటలో విద్యార్థులు..

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.