ETV Bharat / city

Telangana top news 3పీఎం టాప్​న్యూస్

author img

By

Published : Aug 29, 2022, 2:57 PM IST

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

3PM TOPNEWS
3PM TOPNEWS

విద్యాసంస్థల్లో హిజాబ్‌ నిషేధంపై కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. నిషేధం ఎత్తివేయాలన్న అభ్యర్థనలపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. మరోవైపు రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

  • వేములవాడలో ఉద్రిక్తత, మధ్య మానేరు నిర్వాసితుల మహాధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉద్రిక్తత నెలకొంది. మధ్య మానేరు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • మైనర్ బాలికపై వార్డు మెంబర్ అత్యాచారం, రక్తస్రావం కావడంతో

నిజామాబాద్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వార్డు మెంబర్​ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి పరారయ్యాడు.

  • ఛీ, పాడు పనికి పోలీస్ స్టేషన్​నే వాడుకున్నాడా ఏఎస్సై

ఎవరికి దొరక్కుండా ఉండేందుకు, పోలీస్ స్టేషన్​ను మించిన సేఫ్ ప్లేస్ ఏముంటుందిలే అని అనుకున్నాడేమో ఆ ఏఎస్సై. కాని రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు. కారణం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి..

  • మార్కెట్ బాక్స్​ ట్రేడింగ్ యాప్​ పేరిట మోసం, తొలిసారి భారీ నగదు రికవరీ

దేశంలోనే అతిపెద్ద సైబర్‌క్రైమ్​కు సంబంధించి సైబరాబాద్ పోలీసులు భారీ నగదు రికవరీ చేశారు. ట్రేడింగ్‌ యాప్‌ పేరుతో అమాయకుల నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేసిన ముఠాను అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి రూ.9.81 లక్షలను రికవరీ చేశారు.

  • ఆయనకు గిఫ్ట్​గా లగ్జరీ విల్లా​ కొన్న అంబానీ, షాకింగ్ ధర

భారత అపర కుబేరుడు ముకేశ్​ అంబానీ దుబాయ్​లోని సముద్ర తీరంలో ఓ విల్లాను కొనుగోలు చేసినట్లు తెలిసింది. రూ.640 కోట్లతో తన చిన్న కొడుకు అనంత్​ కోసం ఆ విల్లాను ముకేశ్​ కొనుగోలు చేసినట్లు, అందులో 10 పడకగదులు, ప్రైవేట్‌ స్పా, ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉన్నాయని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది.

  • అలా చేయడం వల్లే వికెట్లు దక్కాయన్న హార్దిక్​

పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో తన ప్రదర్శనపై మాట్లాడాడు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య. ప్రత్యర్థులను ఎలా ఔట్​ చేశాడో వివరించాడు.

  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో, ఏమైంది

వరుస యాక్షన్‌ కథా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరించే కోలీవుడ్‌ స్టార్​ హీరో విశాల్‌. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'మార్క్‌ ఆంటోనీ'. పాన్‌ ఇండియా మూవీగా సిద్ధమవుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సోమవారం విడుదలైంది. ఇందులో విశాల్‌ తుపాకీ గురి పెట్టి శత్రువులపై పోరాటం చేస్తున్నట్లు ఉగ్రరూపంలో కనిపించారు.

  • కాంగ్రెస్​కు డాక్టర్​ బదులు కాంపౌండర్ల వైద్యం

తాను బలవంతంగా కాంగ్రెస్​ పార్టీని వీడాల్సి వచ్చిందని గులాం నబీ ఆజాద్​ అన్నారు. సోనియా గాంధీకి లేఖ రాసినప్పటి నుంచి తనను టార్గెట్​ చేశారని, రాజీనామాకు మోదీని సాకు చూపుతున్నారన్నారు.

  • వరదలో బస్సు, లక్కీగా బయటపడ్డ ప్రయాణికులు, ఎంపీ ఇల్లు జలమయం

కర్ణాటకలో గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అనేక చోట్ల వరదల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామనగరలో ప్రయాణికులతో ఉన్న ఓ బస్సు వరద నీటిలో చిక్కుకుంది. స్థానికులు వారిని కాపాడారు.

  • హిజాబ్‌ బ్యాన్​పై సుప్రీం కీలక నిర్ణయం

విద్యాసంస్థల్లో హిజాబ్‌ నిషేధంపై కర్ణాటక ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది. నిషేధం ఎత్తివేయాలన్న అభ్యర్థనలపై స్పందన తెలియజేయాలని ఆదేశించింది. మరోవైపు రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలు వ్యవహారంపై దాఖలైన పిటిషన్‌ను సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది.

  • వేములవాడలో ఉద్రిక్తత, మధ్య మానేరు నిర్వాసితుల మహాధర్నా

రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో ఉద్రిక్తత నెలకొంది. మధ్య మానేరు నిర్వాసితులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు, నిర్వాసితులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

  • మైనర్ బాలికపై వార్డు మెంబర్ అత్యాచారం, రక్తస్రావం కావడంతో

నిజామాబాద్​ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ వార్డు మెంబర్​ మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలికి తీవ్ర రక్తస్రావం కావడంతో ఆసుపత్రిలో చేర్పించి అక్కడి నుంచి పరారయ్యాడు.

  • ఛీ, పాడు పనికి పోలీస్ స్టేషన్​నే వాడుకున్నాడా ఏఎస్సై

ఎవరికి దొరక్కుండా ఉండేందుకు, పోలీస్ స్టేషన్​ను మించిన సేఫ్ ప్లేస్ ఏముంటుందిలే అని అనుకున్నాడేమో ఆ ఏఎస్సై. కాని రెడ్ హ్యాండ్ గా దొరికిపోయాడు. కారణం తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి..

  • మార్కెట్ బాక్స్​ ట్రేడింగ్ యాప్​ పేరిట మోసం, తొలిసారి భారీ నగదు రికవరీ

దేశంలోనే అతిపెద్ద సైబర్‌క్రైమ్​కు సంబంధించి సైబరాబాద్ పోలీసులు భారీ నగదు రికవరీ చేశారు. ట్రేడింగ్‌ యాప్‌ పేరుతో అమాయకుల నుంచి రూ.10 కోట్ల వరకు వసూలు చేసిన ముఠాను అరెస్టు చేసిన పోలీసులు, వారి నుంచి రూ.9.81 లక్షలను రికవరీ చేశారు.

  • ఆయనకు గిఫ్ట్​గా లగ్జరీ విల్లా​ కొన్న అంబానీ, షాకింగ్ ధర

భారత అపర కుబేరుడు ముకేశ్​ అంబానీ దుబాయ్​లోని సముద్ర తీరంలో ఓ విల్లాను కొనుగోలు చేసినట్లు తెలిసింది. రూ.640 కోట్లతో తన చిన్న కొడుకు అనంత్​ కోసం ఆ విల్లాను ముకేశ్​ కొనుగోలు చేసినట్లు, అందులో 10 పడకగదులు, ప్రైవేట్‌ స్పా, ఇండోర్‌, అవుట్‌డోర్‌ స్విమ్మింగ్‌ పూల్స్‌ ఉన్నాయని బ్లూమ్‌బర్గ్‌ వెల్లడించింది.

  • అలా చేయడం వల్లే వికెట్లు దక్కాయన్న హార్దిక్​

పాకిస్థాన్​తో జరిగిన మ్యాచ్​లో తన ప్రదర్శనపై మాట్లాడాడు టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య. ప్రత్యర్థులను ఎలా ఔట్​ చేశాడో వివరించాడు.

  • గుర్తుపట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరో, ఏమైంది

వరుస యాక్షన్‌ కథా చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని అలరించే కోలీవుడ్‌ స్టార్​ హీరో విశాల్‌. ఆయన హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం 'మార్క్‌ ఆంటోనీ'. పాన్‌ ఇండియా మూవీగా సిద్ధమవుతోన్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ సోమవారం విడుదలైంది. ఇందులో విశాల్‌ తుపాకీ గురి పెట్టి శత్రువులపై పోరాటం చేస్తున్నట్లు ఉగ్రరూపంలో కనిపించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.