ETV Bharat / city

అప్పుల్లో తెలంగాణ ఆరో స్థానం... ఏపీ మూడో స్థానం

author img

By

Published : Jul 14, 2020, 7:01 AM IST

Updated : Jul 14, 2020, 8:18 AM IST

అప్పుల్లో రాష్ట్రం దేశంలోనే 6 స్థానం ఆక్రమించింది. గతేడాది తొమ్మిదో స్థానంలో ఉన్న తెలంగాణ ఈ ఏడాది ఆరోస్థానం పొందగా, ఏపీ ఆరోస్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. రాష్ట్రంలో అప్పుల భారం 38 శాతం పెరిగింది. రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన బులిటెన్‌ ఈ వివరాల్ని వెల్లడించింది.

telangana
telangana

అప్పులు తీసుకోవడంలో తెలుగురాష్ట్రాలు పోటీపడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే తెలంగాణలో అప్పుల భారం 38 శాతం పెరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో 42 శాతం పెరిగింది. గతేడాది దేశంలో తొమ్మిదో స్థానంలో ఉన్న తెలంగాణ ఈ ఏడాది ఆరోస్థానం పొందగా, ఏపీ ఆరోస్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. సోమవారం రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన బులిటెన్‌ ఈ వివరాల్ని వెల్లడించింది.

తెలంగాణలో ఇలా...

తెలంగాణ రాష్ట్రం 2018-19లో బహిరంగ మార్కెట్‌ నుంచి స్థూలంగా రూ.26,740 కోట్లు, నికరంగా రూ.22,183 కోట్ల రుణం సేకరించింది. 2019-20 కల్లా స్థూల రుణం రూ.37,109 కోట్లు, నికరరుణం రూ.30,697 కోట్లకు చేరింది. దీన్నిబట్టి ఏడాది కాలంలో స్థూలరుణం 38.77%, నికర రుణం 38.38% పెరిగింది. గత ఏడాది దేశంలో బహిరంగ మార్కెట్‌ నుంచి అత్యధిక రుణం సేకరించిన 9వ రాష్ట్రంగా నిలిచింది. 2020-21 సంవత్సరంలో ఏప్రిల్‌, మేనెలల్లో తెలంగాణ రాష్ట్రం స్థూలంగా రూ.8వేల కోట్లు, నికరంగా రూ.6,750 కోట్ల మేర సేకరించింది. ఈ విషయంలో రాష్ట్రం 6వ స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది ఇప్పటివరకు తీసుకున్న దాన్ని బట్టి చూస్తే మొత్తం ఆర్థిక సంవత్సరంలో స్థూలరుణం రూ.48వేల కోట్లకు, నికర రుణం రూ.40,500కోట్లకు చేరే అవకాశం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ లెక్క ఇదీ!

2018-19తో పోలిస్తే 2019-20లో బహిరంగ మార్కెట్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సేకరించిన స్థూల రుణం 42.10%, నికర రుణం 42.47%మేర పెరిగింది. 2020-21 మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నెలకు సగటున రూ.3,333 కోట్ల చొప్పున రూ.10వేల కోట్ల స్థూల రుణం తీసుకొంది. ఇందులో నికర రుణవాటా రూ.8,250 కోట్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. గత ఏడాది అత్యధిక రుణాలు తీసుకున్న రాష్ట్రంగా ఆరోస్థానం ఆక్రమించిన ఆంధ్రప్రదేశ్‌ 2020-21లో ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం మూడో స్థానంలో నిలిచింది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 36,221కి చేరిన కరోనా బాధితులు..

అప్పులు తీసుకోవడంలో తెలుగురాష్ట్రాలు పోటీపడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే తెలంగాణలో అప్పుల భారం 38 శాతం పెరగ్గా, ఆంధ్రప్రదేశ్‌లో 42 శాతం పెరిగింది. గతేడాది దేశంలో తొమ్మిదో స్థానంలో ఉన్న తెలంగాణ ఈ ఏడాది ఆరోస్థానం పొందగా, ఏపీ ఆరోస్థానం నుంచి మూడో స్థానానికి ఎగబాకింది. సోమవారం రిజర్వుబ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా విడుదల చేసిన బులిటెన్‌ ఈ వివరాల్ని వెల్లడించింది.

తెలంగాణలో ఇలా...

తెలంగాణ రాష్ట్రం 2018-19లో బహిరంగ మార్కెట్‌ నుంచి స్థూలంగా రూ.26,740 కోట్లు, నికరంగా రూ.22,183 కోట్ల రుణం సేకరించింది. 2019-20 కల్లా స్థూల రుణం రూ.37,109 కోట్లు, నికరరుణం రూ.30,697 కోట్లకు చేరింది. దీన్నిబట్టి ఏడాది కాలంలో స్థూలరుణం 38.77%, నికర రుణం 38.38% పెరిగింది. గత ఏడాది దేశంలో బహిరంగ మార్కెట్‌ నుంచి అత్యధిక రుణం సేకరించిన 9వ రాష్ట్రంగా నిలిచింది. 2020-21 సంవత్సరంలో ఏప్రిల్‌, మేనెలల్లో తెలంగాణ రాష్ట్రం స్థూలంగా రూ.8వేల కోట్లు, నికరంగా రూ.6,750 కోట్ల మేర సేకరించింది. ఈ విషయంలో రాష్ట్రం 6వ స్థానాన్ని ఆక్రమించింది. ఈ ఏడాది ఇప్పటివరకు తీసుకున్న దాన్ని బట్టి చూస్తే మొత్తం ఆర్థిక సంవత్సరంలో స్థూలరుణం రూ.48వేల కోట్లకు, నికర రుణం రూ.40,500కోట్లకు చేరే అవకాశం ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్‌ లెక్క ఇదీ!

2018-19తో పోలిస్తే 2019-20లో బహిరంగ మార్కెట్‌ నుంచి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సేకరించిన స్థూల రుణం 42.10%, నికర రుణం 42.47%మేర పెరిగింది. 2020-21 మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో నెలకు సగటున రూ.3,333 కోట్ల చొప్పున రూ.10వేల కోట్ల స్థూల రుణం తీసుకొంది. ఇందులో నికర రుణవాటా రూ.8,250 కోట్లుగా ఉన్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. గత ఏడాది అత్యధిక రుణాలు తీసుకున్న రాష్ట్రంగా ఆరోస్థానం ఆక్రమించిన ఆంధ్రప్రదేశ్‌ 2020-21లో ఇప్పటివరకు ఉన్న లెక్కల ప్రకారం మూడో స్థానంలో నిలిచింది.

ఇదీ చదవండి: రాష్ట్రంలో 36,221కి చేరిన కరోనా బాధితులు..

Last Updated : Jul 14, 2020, 8:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.