ETV Bharat / city

పోలీసులు విశ్రాంతి తీసుకోండి: డీజీపీ మహేందర్‌ రెడ్డి

author img

By

Published : Jun 10, 2020, 9:59 AM IST

Updated : Jun 10, 2020, 11:52 AM IST

telangana dgp
telangana dgp

09:55 June 10

పోలీసులు విశ్రాంతి తీసుకోండి: డీజీపీ మహేందర్‌ రెడ్డి

కరోనా వైరస్ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అనారోగ్యంగా ఉండే పోలీసులు, అధికారులు విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. లాక్ డౌన్ విధుల్లో భాగంగా పోలీసులు క్షేత్రస్థాయిలో పలురకాల విధులు నిర్వహిస్తున్నారని... దీనివల్ల కొంతమంది కరోనా వైరస్ బారిన పడ్డారని మహేందర్ రెడ్డి తెలిపారు.  

కరోనాకు గురైన వాళ్లు.... అనుమానం ఉన్న వాళ్లు వెంటనే సెలవు తీసుకొని విశ్రాంతి తీసుకుంటే వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉండదని డీజీపీ అన్నారు. సెలవు ఇచ్చే విషయంలో యూనిట్ అధికారులు ఎలాంటి సంశయానికి లోనుకావొద్దని...  సాధారణ సెలువులు, ఆర్జిత సెలవుల అనుమతి గురించి జాప్యం చేయకుండా వెంటనే విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.

09:55 June 10

పోలీసులు విశ్రాంతి తీసుకోండి: డీజీపీ మహేందర్‌ రెడ్డి

కరోనా వైరస్ బారిన పడుతున్న పోలీసుల సంఖ్య క్రమంగా పెరుగడంతో పోలీస్ శాఖ అప్రమత్తమైంది. అనారోగ్యంగా ఉండే పోలీసులు, అధికారులు విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు. లాక్ డౌన్ విధుల్లో భాగంగా పోలీసులు క్షేత్రస్థాయిలో పలురకాల విధులు నిర్వహిస్తున్నారని... దీనివల్ల కొంతమంది కరోనా వైరస్ బారిన పడ్డారని మహేందర్ రెడ్డి తెలిపారు.  

కరోనాకు గురైన వాళ్లు.... అనుమానం ఉన్న వాళ్లు వెంటనే సెలవు తీసుకొని విశ్రాంతి తీసుకుంటే వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉండదని డీజీపీ అన్నారు. సెలవు ఇచ్చే విషయంలో యూనిట్ అధికారులు ఎలాంటి సంశయానికి లోనుకావొద్దని...  సాధారణ సెలువులు, ఆర్జిత సెలవుల అనుమతి గురించి జాప్యం చేయకుండా వెంటనే విశ్రాంతి తీసుకోవాలని డీజీపీ మహేందర్ రెడ్డి సూచించారు.

Last Updated : Jun 10, 2020, 11:52 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.