రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల పరిధిలో పీజీ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష 'సీపీజీఈటీ-2021' నోటిఫికేషన్ విడుదలైంది. 30 జులై నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. దరఖాస్తులకు 25 ఆగస్టు చివరి తేదీగా నిర్ణయించారు.
రూ. 500 ఆలస్య రుసుముతో 30 ఆగస్టు వరకు, రూ. 2000 ఆలస్య రుసుంతో 03 సెప్టెంబర్ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రవేశ పరీక్షలు జరగనున్నట్లు కన్వీనర్ ప్రొఫెసర్ పాండు రంగారెడ్డి ప్రకటించారు.