ETV Bharat / city

ఆ భూములు కొట్టేసేందుకు సీఎం ప్లాన్​ చేస్తున్నారన్న పార్థసారథి

author img

By

Published : Aug 24, 2022, 2:55 PM IST

BK Parthasarathy on Lepakshi lands లేపాక్షి భూముల్ని సీఎం జగన్​ హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని తెదేపా నేత బీకే పార్థసారథి ఆరోపించారు. తెరవెనుక ఎవరున్నారో తేలాలంటే సీబీఐ విచారణ జరగాలన్నారు. సీఎం, విజయసాయి అండతోనే ఎర్తిన్ సంస్థ కొనుగోళ్లకు సిద్ధమైందని విమర్శించారు. లేపాక్షి భూముల్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు.

BK Parthasarathy on Lepakshi lands
BK Parthasarathy on Lepakshi lands

BK Parthasarathy on Lepakshi lands క్విడ్ ప్రోకో2లో భాగంగా లేపాక్షి భూముల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని తెదేపా సీనియర్ నేత బీకే పార్థసారథి ఆరోపించారు. జగన్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టే వేల కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని 500 కోట్లకే ఎర్తిన్ సంస్థకు కట్టబెట్టేందుకు బ్యాంకర్లు సిద్ధపడ్డారన్నారు. చౌకగా భూములు కట్టబెట్టేందుకు బ్యాంకర్లు ఎందుకు ఒప్పుకున్నారో, తెరవెనుక ఎవరున్నారో నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరగాలని డిమాండ్‌చేశారు.

"లేపాక్షి భూముల్ని సీఎం హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. సీఎం పాత్ర ఉంది కాబట్టే రూ.500 కోట్లకే ఇచ్చేందుకు బ్యాంకర్లు సిద్ధపడ్డారు. చౌకగా భూములు కట్టబెట్టేందుకు బ్యాంకర్లు ఎలా ఒప్పుకున్నారో. తెరవెనుక ఎవరున్నారో తేలాలంటే సీబీఐ విచారణ జరగాలి. సీఎం, విజయసాయి అండతోనే ఎర్తిన్ సంస్థ కొనుగోళ్లకు సిద్ధమైంది. లేపాక్షి భూముల్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం తప్పదు." -బీకే పార్థసారథి, ఏపీ తెదేపా సీనియర్ నేత

జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి అండతోనే ఎర్తిన్ సంస్థ భూ కొనుగోళ్ళకు సిద్ధమైందని దుయ్యబట్టారు. తక్షణమే లేపాక్షి భూముల్ని వెనక్కి తీసుకోకుంటే రైతులతో కలిసి ఉద్యమం తప్పుదని హెచ్చరించారు. 2020 వరకు రూ.4 కోట్లు కూడా లేని ఎర్తిన్ సంస్థ ఇప్పుడు జగన్ అండతోనే 500 కోట్లతో లేపాక్షి భూముల కొనుగోలుకు సిద్ధపడిందని పార్థసారథి ఆరోపించారు.

ఆ భూములు కొట్టేసేందుకు సీఎం ప్లాన్​ చేస్తున్నారన్న పార్థసారథి

ఇవీ చదవండి: రోడ్లు విస్తరించినా మహబూబ్​నగర్​కు తీరని ట్రాఫిక్ ఇక్కట్లు

80 ఏళ్ల వయసులో 600 కిమీ బైక్​ రైడ్, బామ్మకు హ్యాట్సాఫ్​ చెప్పాల్సిందే

BK Parthasarathy on Lepakshi lands క్విడ్ ప్రోకో2లో భాగంగా లేపాక్షి భూముల్ని సీఎం జగన్మోహన్ రెడ్డి హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారని తెదేపా సీనియర్ నేత బీకే పార్థసారథి ఆరోపించారు. జగన్ రెడ్డి పాత్ర ఉంది కాబట్టే వేల కోట్ల రూపాయల విలువ చేసే భూముల్ని 500 కోట్లకే ఎర్తిన్ సంస్థకు కట్టబెట్టేందుకు బ్యాంకర్లు సిద్ధపడ్డారన్నారు. చౌకగా భూములు కట్టబెట్టేందుకు బ్యాంకర్లు ఎందుకు ఒప్పుకున్నారో, తెరవెనుక ఎవరున్నారో నిగ్గు తేలాలంటే సీబీఐ విచారణ జరగాలని డిమాండ్‌చేశారు.

"లేపాక్షి భూముల్ని సీఎం హస్తగతం చేసుకోవాలని చూస్తున్నారు. సీఎం పాత్ర ఉంది కాబట్టే రూ.500 కోట్లకే ఇచ్చేందుకు బ్యాంకర్లు సిద్ధపడ్డారు. చౌకగా భూములు కట్టబెట్టేందుకు బ్యాంకర్లు ఎలా ఒప్పుకున్నారో. తెరవెనుక ఎవరున్నారో తేలాలంటే సీబీఐ విచారణ జరగాలి. సీఎం, విజయసాయి అండతోనే ఎర్తిన్ సంస్థ కొనుగోళ్లకు సిద్ధమైంది. లేపాక్షి భూముల్ని వెనక్కి తీసుకోకుంటే ఉద్యమం తప్పదు." -బీకే పార్థసారథి, ఏపీ తెదేపా సీనియర్ నేత

జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి అండతోనే ఎర్తిన్ సంస్థ భూ కొనుగోళ్ళకు సిద్ధమైందని దుయ్యబట్టారు. తక్షణమే లేపాక్షి భూముల్ని వెనక్కి తీసుకోకుంటే రైతులతో కలిసి ఉద్యమం తప్పుదని హెచ్చరించారు. 2020 వరకు రూ.4 కోట్లు కూడా లేని ఎర్తిన్ సంస్థ ఇప్పుడు జగన్ అండతోనే 500 కోట్లతో లేపాక్షి భూముల కొనుగోలుకు సిద్ధపడిందని పార్థసారథి ఆరోపించారు.

ఆ భూములు కొట్టేసేందుకు సీఎం ప్లాన్​ చేస్తున్నారన్న పార్థసారథి

ఇవీ చదవండి: రోడ్లు విస్తరించినా మహబూబ్​నగర్​కు తీరని ట్రాఫిక్ ఇక్కట్లు

80 ఏళ్ల వయసులో 600 కిమీ బైక్​ రైడ్, బామ్మకు హ్యాట్సాఫ్​ చెప్పాల్సిందే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.