ETV Bharat / city

'క్లిష్ట పరిస్థితుల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న నేత పీవీ'

author img

By

Published : Jul 25, 2020, 5:41 AM IST

దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నపుడు తన సంస్కరణలతో గాడిన పెట్టగలిగిన మహోన్నత వ్యక్తిగా...భారత మాజీ ప్రధాని, దివంగత నేత పీవీ నరసింహరావును కాంగ్రెస్‌ పార్టీ కీర్తించింది. పీసీసీ ఆధ్వర్యంలో గాంధీ భవన్‌లో పీవీ శతజయంతి ఉత్సవాలు ప్రారంభించారు. కార్యక్రమంలో భాగం పంచుకున్న ప్రముఖులు...పీవీతో వారికున్న అనుబంధాలను...పార్టీకి, దేశానికి పీవీ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.

'క్లిష్ట పరిస్థితుల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న నేత పీవీ'
'క్లిష్ట పరిస్థితుల్లో సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న నేత పీవీ'

‍భారత మాజీ ప్రధాని దివంగత నేత.. పీవీ నరసింహారావు నిబద్ధతతో కూడిన కాంగ్రెస్‌ నేతని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కొనియాడారు. తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో ఏడాదిపాటు నిర్వహించనున్న పీవీ శతజయంతి ఉత్సవాలను శుక్రవారం ప్రారంభించారు.

ఎంతో సహనంతో..

కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌... దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మహోన్నత వ్యక్తి పీవీ అని అభివర్ణించారు. పీవీ సంస్కరణల కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని వివరించారు. ప్రతిపక్షాల విమర్శలను ఎంతో సహనంతో విని సమాధానాలు ఇచ్చే ఉదాత్తమైన నేతగా పీవీని కొనియాడిన ప్రణబ్‌... పీవీ హయాంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌తోనే దేశంలో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని ప్రశంసించారు.

మూడు దశాబ్దాల క్రితం అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌ ప్రవేశపెట్టిన తొలి వార్షిక బడ్జెట్‌తో పీవీ నరసింహరావు...భారత్‌ను ప్రపంచ శిఖరాలకు తీసుకెళ్లారు. అసాధారణ నిర్ణయాలు తీసుకొని, వాటిని అదే రీతిలో అమలు పర్చడంలో పీవీ నరసింహరావు దిట్ట. - ప్రణభ్‌ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి

పీవీ హయాంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్...భారత్‌లో అనేక మార్పులు తీసుకువచ్చింది. ఆర్థిక సంస్కరణలు, సరళీకరణలకు ఆ బడ్జెట్‌ ఊతమిచ్చింది. ధైర్యసాహసాలు ప్రదర్శించి సంస్కరణలు అమలుచేసిన దార్శనికత కలిగిన పీవీకి నివాళి అర్పిస్తున్నాను. పీవీ..భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా కొనియాడదగిన నేత. - మన్మోహన్‌ సింగ్‌, మాజీ ప్రధాన మంత్రి

పీవీ స్ఫూర్తితో..

ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్‌ రెడ్డి తెలిపారు. పీవీ స్ఫూర్తితో రాష్ట్రంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఒక సామాన్యుడు దేశాన్ని పాలించగలడని పీవీ నిరూపించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు. పీవీ నడచిన మార్గం భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకమని నేతలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడిన పలువురు కేంద్ర మాజీ మంత్రులు.. పీవీతో తమకున్న అనుబంధాన్ని ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.

ఇవీ చూడండి: కరోనా పరీక్షలు, సదుపాయాలు పెంచాం : సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

‍భారత మాజీ ప్రధాని దివంగత నేత.. పీవీ నరసింహారావు నిబద్ధతతో కూడిన కాంగ్రెస్‌ నేతని ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ కొనియాడారు. తెలంగాణ పీసీసీ ఆధ్వర్యంలో ఏడాదిపాటు నిర్వహించనున్న పీవీ శతజయంతి ఉత్సవాలను శుక్రవారం ప్రారంభించారు.

ఎంతో సహనంతో..

కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడిన మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌... దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సాహసోపేత నిర్ణయాలు తీసుకున్న మహోన్నత వ్యక్తి పీవీ అని అభివర్ణించారు. పీవీ సంస్కరణల కారణంగానే దేశ ఆర్థిక పరిస్థితి మెరుగుపడిందని వివరించారు. ప్రతిపక్షాల విమర్శలను ఎంతో సహనంతో విని సమాధానాలు ఇచ్చే ఉదాత్తమైన నేతగా పీవీని కొనియాడిన ప్రణబ్‌... పీవీ హయాంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్‌తోనే దేశంలో అనేక సానుకూల మార్పులు చోటుచేసుకున్నాయని ప్రశంసించారు.

మూడు దశాబ్దాల క్రితం అప్పటి ఆర్థిక మంత్రి మన్మోహన్ సింగ్‌ ప్రవేశపెట్టిన తొలి వార్షిక బడ్జెట్‌తో పీవీ నరసింహరావు...భారత్‌ను ప్రపంచ శిఖరాలకు తీసుకెళ్లారు. అసాధారణ నిర్ణయాలు తీసుకొని, వాటిని అదే రీతిలో అమలు పర్చడంలో పీవీ నరసింహరావు దిట్ట. - ప్రణభ్‌ ముఖర్జీ, మాజీ రాష్ట్రపతి

పీవీ హయాంలో ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్...భారత్‌లో అనేక మార్పులు తీసుకువచ్చింది. ఆర్థిక సంస్కరణలు, సరళీకరణలకు ఆ బడ్జెట్‌ ఊతమిచ్చింది. ధైర్యసాహసాలు ప్రదర్శించి సంస్కరణలు అమలుచేసిన దార్శనికత కలిగిన పీవీకి నివాళి అర్పిస్తున్నాను. పీవీ..భారత ఆర్థిక సంస్కరణల పితామహుడిగా కొనియాడదగిన నేత. - మన్మోహన్‌ సింగ్‌, మాజీ ప్రధాన మంత్రి

పీవీ స్ఫూర్తితో..

ఏడాది పాటు శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్‌ రెడ్డి తెలిపారు. పీవీ స్ఫూర్తితో రాష్ట్రంలో పార్టీని మరింత ముందుకు తీసుకెళ్తామని పేర్కొన్నారు. ఒక సామాన్యుడు దేశాన్ని పాలించగలడని పీవీ నిరూపించారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కొనియాడారు. పీవీ నడచిన మార్గం భవిష్యత్‌ తరాలకు మార్గదర్శకమని నేతలు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్‌ ద్వారా మాట్లాడిన పలువురు కేంద్ర మాజీ మంత్రులు.. పీవీతో తమకున్న అనుబంధాన్ని ఆయన సేవలను గుర్తుచేసుకున్నారు.

ఇవీ చూడండి: కరోనా పరీక్షలు, సదుపాయాలు పెంచాం : సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.