ETV Bharat / city

కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రవేశ పరీక్షలా..: ఉత్తమ్​

author img

By

Published : Aug 12, 2020, 8:05 PM IST

కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రవేశ పరీక్షలను రీషెడ్యూల్​ చేయడాన్ని పీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్​ తప్పుపట్టారు. ఎన్​‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌తోపాటు ఇతర విద్యార్థులను విడుదల చేయాలని లేకుంటే తామే ప్రగతిభవన్​ను ముట్టడిస్తామని ఎంపీ కోమటిరెడ్డి హెచ్చరించారు.

uttam on students arrest
కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రవేశ పరీక్షలా..: ఉత్తమ్​

విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్​‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌తోపాటు పలువురు నాయకుల అరెస్టు, ప్రజాస్వామ్యానికి విరుద్దమని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలపై నిరసన వ్యక్తంచేసే హక్కు ప్రతి పౌరునికి ఉందన్నారు.

పరీక్షల నిర్వహణ అంశం కోర్టులో ఉండగా.. ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకు పూనుకోవడాన్ని తప్పుపట్టారు. ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతోందని, ఆస్పత్రుల్లో సౌకర్యాల లేవని, కరోనా బాధితులను పైవేటు ఆస్పత్రులు అవస్థలు పెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రవేశ పరీక్షలను రీషెడ్యూల్‌ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంకట్‌తో సహా ఏ ఒక్కరిపైనా ఎలాంటి కేసులు పెట్టకుండా విడిచిపెట్టాలని డిమాండ్​ చేశారు.

ఎన్​‌ఎస్‌యూఐ నాయకుల అరెస్టును భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఖండించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే ఎన్​‌ఎస్‌యూఐ విద్యార్థులు ప్రగతిభవన్​ను ముట్టడించారని తెలిపారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని లేకుంటే తామే ప్రగతిభవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇవీచూడండి: కాంగ్రెస్​ నేతలు భట్టి, జగ్గారెడ్డి, శ్రీధర్​బాబులను అడ్డుకున్న పోలీసులు

విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్​‌ఎస్‌యూఐ అధ్యక్షుడు వెంకట్‌తోపాటు పలువురు నాయకుల అరెస్టు, ప్రజాస్వామ్యానికి విరుద్దమని స్పష్టం చేశారు. ప్రజాసమస్యలపై నిరసన వ్యక్తంచేసే హక్కు ప్రతి పౌరునికి ఉందన్నారు.

పరీక్షల నిర్వహణ అంశం కోర్టులో ఉండగా.. ప్రభుత్వం మాత్రం పరీక్షల నిర్వహణకు పూనుకోవడాన్ని తప్పుపట్టారు. ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతోందని, ఆస్పత్రుల్లో సౌకర్యాల లేవని, కరోనా బాధితులను పైవేటు ఆస్పత్రులు అవస్థలు పెడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి తరుణంలో ప్రవేశ పరీక్షలను రీషెడ్యూల్‌ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంకట్‌తో సహా ఏ ఒక్కరిపైనా ఎలాంటి కేసులు పెట్టకుండా విడిచిపెట్టాలని డిమాండ్​ చేశారు.

ఎన్​‌ఎస్‌యూఐ నాయకుల అరెస్టును భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఖండించారు. విద్యార్థుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికే ఎన్​‌ఎస్‌యూఐ విద్యార్థులు ప్రగతిభవన్​ను ముట్టడించారని తెలిపారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని లేకుంటే తామే ప్రగతిభవన్​ను ముట్టడిస్తామని హెచ్చరించారు.

ఇవీచూడండి: కాంగ్రెస్​ నేతలు భట్టి, జగ్గారెడ్డి, శ్రీధర్​బాబులను అడ్డుకున్న పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.