ETV Bharat / city

'భవిష్యత్తులో భారత్​లో ఆహార భద్రతకు ఢోకా లేదు' - Food security in India class 9

హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధన సంస్థలో సొసైటీ ఫర్ ప్లాంట్ బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ ఆధ్వర్యంలో సమగ్ర మొక్కల జీవ రసాయన, జీవ సాంకేతిక పరిజ్ఞానంపై సదస్సు జరిగింది. 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థపై ఐసీఏఆర్ డీజీ త్రిలోచన్ మహాపాత్ర కీలక సూచనలు చేశారు.

"భారత్​లో ఆహార భద్రతకు ఢోకా లేదు"
author img

By

Published : Nov 9, 2019, 10:51 AM IST

వ్యవసాయ పంటల సాగులో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించుకోవడం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ఆశిస్తున్న 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధించవచ్చని భారత వ్యవసాయ పరిశోధన మండలి - ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధన సంస్థలో సొసైటీ ఫర్ ప్లాంట్ బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ ఆధ్వర్యంలో సమగ్ర మొక్కల జీవ రసాయన, జీవ సాంకేతిక పరిజ్ఞానంపై జరిగిన సదస్సుకు డీజీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇప్పటికే స్వయం సమృద్ధి సాధించిన దృష్ట్యా వ్యవసాయ వృక్షం నీడన ఇది సాధించడం పెద్ద కష్టం కాదని, రాబోయో రోజుల్లో ఆహార భద్రతకు ఢోకా లేదని స్పష్టం చేశారు.


రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ పద్మభూషణ్ ప్రొఫెసర్ జి.పద్మనాభన్‌, ఐసీఏఆర్ అనుబంధ పరిశోధన సంస్థల సంచాలకులు, శాస్త్రవేత్తలు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరయ్యారు. దేశంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో సమగ్ర మొక్కల జీవ రసాయన, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఉత్తమ ఫలితాలు సాధించడంపై నిపుణులు చర్చించారు.

వ్యవసాయ పంటల సాగులో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించుకోవడం ద్వారా ప్రధాని నరేంద్రమోదీ ఆశిస్తున్న 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధించవచ్చని భారత వ్యవసాయ పరిశోధన మండలి - ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర అన్నారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధన సంస్థలో సొసైటీ ఫర్ ప్లాంట్ బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ ఆధ్వర్యంలో సమగ్ర మొక్కల జీవ రసాయన, జీవ సాంకేతిక పరిజ్ఞానంపై జరిగిన సదస్సుకు డీజీ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఇప్పటికే స్వయం సమృద్ధి సాధించిన దృష్ట్యా వ్యవసాయ వృక్షం నీడన ఇది సాధించడం పెద్ద కష్టం కాదని, రాబోయో రోజుల్లో ఆహార భద్రతకు ఢోకా లేదని స్పష్టం చేశారు.


రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ పద్మభూషణ్ ప్రొఫెసర్ జి.పద్మనాభన్‌, ఐసీఏఆర్ అనుబంధ పరిశోధన సంస్థల సంచాలకులు, శాస్త్రవేత్తలు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు హాజరయ్యారు. దేశంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో సమగ్ర మొక్కల జీవ రసాయన, సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఉత్తమ ఫలితాలు సాధించడంపై నిపుణులు చర్చించారు.

"భారత్​లో ఆహార భద్రతకు ఢోకా లేదు"

ఇదీ చదవండి: నేడు ఆర్టీసీ కార్మికుల 'ఛలో ట్యాంక్​ బండ్'​

08-11-2019 TG_HYD_42_08_ICAR_DG_ON_FIVE_TRILLION_DOLLER_ECONOMY_AB_3038200 REPORTER : MALLIK.B CAM : SURYANARAYANA ( ) దేశంలో వ్యవసాయ పంట సాగులో ఉత్పత్తి, ఉత్పాదకత పెంపొందించుకోవడం ద్వారా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆశిస్తున్న 5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ సాధించవచ్చనిభారత వ్యవసాయ పరిశోధన మండలి - ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర అన్నారు. ఇప్పటికే స్వయం సమృద్ధి సాధించిన దృష్ట్యా వ్యవసాయ వృక్షం నీడన ఇది సాధించడం పెద్ద కష్టం కాదని, రాబోయో రోజుల్లో సైతం ఆహార భద్రతకు ఢోకా లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని భారతీయ వరి పరిశోధన సంస్థలో సొసైటీ ఫర్ ప్లాంట్ బయో కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ ఆధ్వర్యంలో సమగ్ర మొక్కల జీవ రసాయన, జీవ సాంకేతిక పరిజ్ఞానంపై జరిగిన సదస్సుకు డీజీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. రెండు రోజులపాటు జరగనున్న ఈ కార్యక్రమంలో బెంగళూరు ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ మాజీ డైరెక్టర్ పద్మభూషణ్ ప్రొఫెసర్ జి.పద్మనాభన్‌, రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌ మహారాణ ప్రతాప్ వ్యవసాయ, సాంకేతిక విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి డాక్టర్ ఎస్‌ఎల్‌ మెహతా, ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ వెల్చాల ప్రవీణ్‌రావు, ఐసీఏఆర్ - భారతీయ వరి పరిశోధన సంస్థ సంచాలకులు డాక్టర్ ఎస్‌ఆర్‌ ఓలేటి, నార్మ్ సంచాలకులు సీహెచ్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఐసీఏఆర్ అనుబంధ పరిశోధన సంస్థల సంచాలకులు, శాస్త్రవేత్తలు, ఆచార్యులు, పరిశోధకులు, విద్యార్థులు ఈ సదస్సకు హాజరయ్యారు. దేశంలో వాతావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ రంగంలో సమగ్ర మొక్కల జీవ రసాయన, జీవ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి ఉత్తమ ఫలితాలు సాధించడంపై నిపుణులు చర్చించారు. ప్రొఫెసర్ పద్మనాభన్‌... డాక్టర్ ఎన్‌బీ దాస్ స్మారకోపన్యాసం చేశారు. గత మూడు నాలుగేళ్లుగా వ్యవసాయంలో విస్తృత పరిశోధనలు సాగుతున్నాయని డాక్టర్ మహాపాత్ర తెలిపారు. బంగాళదుంప దిగుమతి చేసుకుంటున్న తరుణంలో... అధిక దిగుబడులు ఇచ్చే వంగడాల వృద్ధిససహా... సంప్రదాయ ప్రాంతాలతోపాటు సంప్రదాయేతర రాష్ట్రాల్లో పంట సాగు, విస్తీర్ణం, ఉత్పాదతక పెంపు, అదనపు విలువ జోడింపు, ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన వల్ల దాదాపు 95 శాతం విస్తీర్ణం దేశీయ రకాలే సాగవుతున్నాయని చెప్పారు. తద్వారా ఏటా 55 వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని అన్నారు. కటక్‌ వరి పరిశోధన సంస్థ ద్వారా విడుదలైన వరి రకాల సాగు ద్వారా ఏటా 48 వేల కోట్ల రూపాయల ఆదాయం లభిస్తుందని డీజీ పేర్కొన్నారు. VIS.........BYTE............ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర, డైరెక్టర్ జనరల్, భారత వ్యవసాయ పరిశోధన మండలి - ఐసీఏఆర్‌
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.