ప్రముఖ గ్రూమింగ్ బ్రాండ్ నివియా మెన్ 'ఒకేసారి ఎక్కువ మంది ముఖాన్ని కడుక్కోవడం' అనే పోటీ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి వర్చువల్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అందుకుంది. ఈ నెల 23న నిర్వహించిన ఈ పోటీల్లో భారతదేశం నుంచి వందమంది యువకులు పాల్గొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో చర్మ పరిశుభ్రతకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ నేపథ్యంలో పోటీలు నిర్వహించినట్టు నివియా మెన్ సంస్థ నిర్వాహకులు తెలిపారు. భారత్ నుంచి వందమంది యువకులు పాల్గొనడం, వరల్డ్ రికార్డ్ రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
ఇవీ చూడండి: పీపీఈ కిట్లపై నిర్లక్ష్యం.. జంతువుల పాలిట శాపం