ETV Bharat / city

ఏపీలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు

author img

By

Published : Jun 20, 2020, 7:13 PM IST

ఆంధ్రప్రదేశ్​లో కరోనా కేసుల సంఖ్య 8,452కు చేరింది. ఇవాళ కొత్తగా 491 కేసులు నమోదయ్యాయి. నేడు వైరస్​తో ఐదుగురు మృతి చెందగా... ఇప్పటి వరకు 101మంది మరణించారు.

ap corona cases
ఏపీలో కొత్తగా 491 కరోనా కేసులు నమోదు

ఆంధ్రప్రదేశ్​లో రికార్డుస్థాయిలో ఒకేరోజు 491 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8వేల 452కు చేరింది. కొత్త కేసుల్లో స్థానికంగా ఉంటున్న 390 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 83 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరించారు.

విదేశాల నుంచి వచ్చిన మరో 18మందికి కరోనా సోకింది. కరోనా కారణంగా రాష్ట్రంలో మరో ఐదుగురు మృతి చెందారు. కృష్ణా, కర్నూలు జిల్లాలో ఇద్దరు....గుంటూరులో ఒకరు కరోనాతో మరణించారు. ఇప్పటివరకు మొత్తం 101 మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా 22వేల 371 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 4వేల111 మంది డిశ్చార్జి అయ్యారు. 4వేల240 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్​లో రికార్డుస్థాయిలో ఒకేరోజు 491 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8వేల 452కు చేరింది. కొత్త కేసుల్లో స్థానికంగా ఉంటున్న 390 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 83 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధరించారు.

విదేశాల నుంచి వచ్చిన మరో 18మందికి కరోనా సోకింది. కరోనా కారణంగా రాష్ట్రంలో మరో ఐదుగురు మృతి చెందారు. కృష్ణా, కర్నూలు జిల్లాలో ఇద్దరు....గుంటూరులో ఒకరు కరోనాతో మరణించారు. ఇప్పటివరకు మొత్తం 101 మంది కరోనాకు బలయ్యారు. కొత్తగా 22వేల 371 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనా నుంచి కోలుకుని ఇప్పటివరకు 4వేల111 మంది డిశ్చార్జి అయ్యారు. 4వేల240 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.


ఇవీ చదవండి: కరోనాకు డ్రగ్​ రిలీజ్​- ఒక్కో టాబ్లెట్ రూ.103

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.