న్యాయవాదులు వామన్రావు, నాగమణి దంపతుల హత్యను భాజపా తీవ్రంగా ఖండిస్తోందని ఎమ్మెల్సీ రాంచందర్రావు తెలిపారు. ఇలాంటి ఘటనలు జరగడం విచారకరమన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కోర్టులో పిల్ దాఖలు చేస్తున్న న్యాయవాదులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనన్నారు.
ఈ హత్య న్యాయ వ్యవస్థ మీద దాడి అని వ్యాఖ్యానించారు. హత్యకు కారణమైన దోషులు ఎంతటివారైనా కఠినంగా శిక్షించాలని రాంచందర్రావు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: న్యాయవాదుల ఆందోళన.. విధుల బహిష్కరణ