ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ పిలుపు మేరకు హైదరాబాద్ తార్నాక డివిజన్లో ఎమ్మెల్సీ రామచంద్రా రావు పారిశుద్ధ్య కార్మికులకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భాజపా సీనియర్ నాయకుడు మేకల సారంగపాణి హాజరయ్యారు.
దేశంలో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతోనే ప్రధాని మోదీ గారు నిరుపేదలకు సాయం చేయాలని పిలుపునిచ్చినట్లు వివరించారు. అందులో భాగంగానే తాను పేద ప్రజలకు నిత్యావసర సరుకులు అందజేసినట్లు వివరించారు.
ఇవీ చూడండి: మద్యం సేవిస్తే.. కరోనా సోకే అవకాశాలు ఎక్కువ!