ETV Bharat / city

బహిరంగంగా డబ్బు పంచుతున్నా పట్టించుకోవడం లేదు : రాజాసింగ్

author img

By

Published : Nov 30, 2020, 4:48 PM IST

తెరాస, ఎంఐఎం నేతలు ఓట్ల కోసం గత రాత్రి నుంచి డబ్బు పంపిణీ చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని భాజపా ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బహిరంగంగా నగదు పంచుతున్న వారిపై చర్యలు తీసుకోకుండా.. అడ్డుకున్న భాజపా కార్యకర్తలపై దాడికి పాల్పడుతున్నారని మండిపడ్డారు.

mla raja singh allegations on trs and mim leaders
బహిరంగంగా డబ్బు పంచుతున్నా పట్టించుకోవడం లేదు

ఓట్ల కోసం రాత్రి నుంచి తెరాస, ఎంఐఎం నేతలు డబ్బులు పంచుతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బహిరంగంగా డబ్బు పంపిణీ చేస్తున్నా.. పట్టించుకోకుండా పోలీసులు వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.

డబ్బు పంపిణీని అడ్డుకున్న భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. మైలార్​దేవ్​పల్లితో పాటు పలు డివిజన్లలో కాషాయ కార్యకర్తలపై దాడులు జరిగాయని తెలిపారు. పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు.. పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాసకు అనుకూలంగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్​ఈసీ భావిస్తోందని రాజాసింగ్ ఆరోపించారు.

బహిరంగంగా డబ్బు పంచుతున్నా పట్టించుకోవడం లేదు

ఓట్ల కోసం రాత్రి నుంచి తెరాస, ఎంఐఎం నేతలు డబ్బులు పంచుతున్నారని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. బహిరంగంగా డబ్బు పంపిణీ చేస్తున్నా.. పట్టించుకోకుండా పోలీసులు వారికి వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.

డబ్బు పంపిణీని అడ్డుకున్న భాజపా కార్యకర్తలపై పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారని రాజాసింగ్ మండిపడ్డారు. మైలార్​దేవ్​పల్లితో పాటు పలు డివిజన్లలో కాషాయ కార్యకర్తలపై దాడులు జరిగాయని తెలిపారు. పారదర్శకతతో ఎన్నికలు నిర్వహించాల్సిన అధికారులు.. పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెరాసకు అనుకూలంగా ఎన్నికలు నిర్వహించాలని ఎస్​ఈసీ భావిస్తోందని రాజాసింగ్ ఆరోపించారు.

బహిరంగంగా డబ్బు పంచుతున్నా పట్టించుకోవడం లేదు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.