హైదరాబాద్ పాతబస్తీ చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ పర్యటించారు. బాబా నగర్, ఫూల్ బాగ్, ఒమర్ కాలనీ, గాజి మిల్లత్ కాలనీ, తదితర ప్రాంతాలను స్థానిక కౌన్సిలర్లతో కలిసి పరిశీలించారు.
వర్షంలో తడుస్తూనే ముంపు ప్రాంతాల్లో అక్బరుద్దీన్ తిరిగారు. ప్రజలతో మాట్లాడి జరిగిన నష్టం గురించి తెలుసుకున్నారు. సిబ్బంది చేపడుతున్న సహాయక చర్యలను పర్యవేక్షించారు. వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.
ఇదీ చూడండి: రాంపూర్ శివారులో మంత్రి హరీశ్ రావు వాహనం తనిఖీ